YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇవేళ తిరుపతిలో పర్యటించనున్నారు. శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు జగన్ తిరుపతికి వెళుతున్నారు. అయితే ఈ సారి ప్రత్యేకత ఏమిటంటే.. రేణిగుంట విమానాశ్రయం వద్ద ప్రజల నుండి వినతులను కూడా సీఎం జగన్ స్వీకరించనున్నారు.
సాధారణంగా సీఎం జగన్ ఏ జిల్లాకైనా పర్యటనకు వెళ్లిన సమయంలో ఆ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు విమానాశ్రయం వద్ద స్వాగతం పలుకుతూ ఉంటారు. సాధారణ ప్రజానీకం కలిసేందుకు అవకాశం ఉండేది కాదు. కానీ ఈ సారి మాత్రం విమానాశ్రయం వద్ద ప్రజల నుండి వినతులు స్వీకరించనున్నట్లు సమాచారం. అందు కోసం రేణిగుంట విమానాశ్రయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
ఇక సీఎం జగన్ షెడ్యుల్ ఇలా
- సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం నుండి రేణిగుంటకు సీఎం జగన్ చేరుకుంటారు.
- సాయంత్రం 5.15 గంటల వరకూ విమానాశ్రయం వద్ద ప్రజల నుండి వినతులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అక్కడి నుండి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు.
- సాయంత్రం 5.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి బయలుదేరి రోడ్డు మార్గంలో తిరుపతి తాజ్ హోటల్ కు చేరుకుంటారు.
- సాయంత్రం 5.30 నుండి 5.45 గంటల వరకూ శ్రీసిటీ ఎండి రవి సన్నా రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు సీఎం జగన్.
- అనంతరం 5.45 గంటలకు బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి తిరుగు ప్రయాణం అవుతారు.
- సాయంత్రం 6 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుండి గన్నవరంకు తిరుగు ప్రయాణం అవుతారు.
KCR: పరామర్శించేందుకు ఎవరూ రావొద్దంటూ వీడియో సందేశం ఇచ్చిన కేసిఆర్