KCR: తనను పరామర్శించేందుకు ఎవరూ యశోదా ఆసుపత్రికి రావొద్దంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసిఆర్ నేతలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం వీడియో సందేశం విడుదల చేశారు. కేసిఆర్ బాత్రూమ్ లో జారి పడటంతో ఆయనకు తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం హైదరాబాద్ యశోదా ఆసుపత్రిలో ఆయన కొలుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు యశోదా ఆసుపత్రికి వెళ్లి కేసిఆర్ ను పరామర్శిస్తున్నారు.
మరో పక్క బీఆర్ఎస్ మద్దతు దారులు, కేసిఆర్ అభిమానులు కూడా ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, టీడీపీ అధినేత చంద్రబాబు, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, మెగాస్టార్ చిరంజీవి, పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, ఇవేళ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఎ పాల్ తదితర ప్రముఖులు కేసిఆర్ ను ఇప్పటికే పరామర్శించారు. ఈ నేపథ్యంలో కేసిఆర్ వీడియో సందేశం వెలువరించారు. తనను కలిసేందుకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఎక్కువ మందిని కలవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారని, అందుకే తన ఆరోగ్యం దృష్ట్యా మరో పది రోజుల వరకూ ఎవరూ రావొద్దని కోరారు.
ఆసుపత్రిలో వందలాది మంది రోగులకు ఇబ్బంది కలగకూడదు. ఇన్ ఫెక్షన్ సోకే ప్రమాదం ఉన్నందున ఎవరూ రావొద్దని వైద్యులు చెప్పారు. నేను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. త్వరలో సాధారణ స్థితికి చేరుకుని మీ మధ్యకు వస్తా. కోలుకున్న తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరినీ కులుస్తా, నా పట్ల అభిమానం చూపుతున్న కోట్లాది ప్రజలకు కృతజ్ఞతలు. దయచేసి సహకరించండి అని పార్టీ శ్రేణులకు, అభిమానులకు కేసిఆర్ విజ్ఞప్తి చేశారు.
AP Cabinet Meet: ఈ నెల 15న ఏపీ కేబినెట్ భేటీ .. ఆ రోజు క్లారిటీ ఇవ్వనున్నారా..
దయచేసి సహకరించండి
నాతోపాటు వందలాది పేషంట్లకు ఇబ్బంది కలగకూడదు
కోలుకుని త్వరలోనే మీ నడుమకు వస్తా
ఇన్ఫెక్షన్ వస్తదని డాక్టర్లు నన్ను బయటకు పంపుతలేరు
యశోద దవాఖాన కు రాకండి
– ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి విజ్ఞప్తి
తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని పరామర్శించడానికి… pic.twitter.com/5pnev7TP16
— BRS Party (@BRSparty) December 12, 2023