CM Jagan: భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి పరివాహన ప్రాంతంలో వేలాది ఎకరాలు ముంపునకు గురి అయ్యాయి. వివిధ జిల్లాల్లో తోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లు జలదిగ్బంధం అయ్యాయి. వందలాది మంది బాధితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇంకా గోదావరి వరద ఉదృతి తగ్గలేదు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలపై సీఎం జగన్మోహనరెడ్డి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపి కీలక ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రాంతాల్లై సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్ లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
రేపు భద్రచాలం వద్ద గోదావరి నీటి మట్టం 53.81 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తొందన్నారు. ధవళేశ్వరం వద్ద కూడా వరద ప్రవాహం సుమారు 16 లక్షలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారన్నారు. గత ఏడాది గోదావరిలో 26 లక్షల క్యూసెక్కులకుపైగా వరద ప్రవాహం చూసిన విషయాన్ని గుర్తు చేస్తూ కలెక్టర్ లు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను ముందస్తు గా సహాయ శిబిరాలకు పంపించడంతో పాటు అక్కడ మంచి సదుపాయాలు కల్పించాలని చెప్పారు. శిబిరాల నుండి పంపే సమయంలో కుటుంబానికి రూ.2వేలు, వ్యక్తులైతే వెయ్యి రూపాయలు చొప్పున సాయం చేయాలని ఆదేశించారు.
కచ్చా ఇళ్లు ముంపునకు గురైతే రూ.10వేలు ఆర్ధిక సాయం చేయాలన్నారు. కచ్చా ఇంటి విషయంలో పాక్షికంగా దెబ్బతిన్నదా లేక పూర్తిగా దెబ్బతిన్నదా అన్న వర్గీకరణ లేకుండా సాయం అందించాలన్నారు.. వరద బాధితుల పట్ల కలెక్టర్ లు మానవీయ దృక్పదంతో వ్యవహరించాలని చెప్పారు. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వం బాసటగా నిలిచిందనే మాట రావాలన్నారు. వరదల్లో దెబ్బతిన్న పంటల నష్టాన్ని అంచనా వేసి నివేదిక అందించాలని ఆదేశించారు.
విజయవాడ – హైదరాబాద్ హైవే తగ్గిన వరద .. వాహనాల రాకపోకలు పునరుద్దరణ