AP High Court: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. మూడు కేసుల్లోనూ ఒకే సారి ఏపీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. బుధవారం హైకోర్టులో చంద్రబాబుపై ఉన్న పలు కేసులపై విచారణ జరిగింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసు (ఐఆర్ఆర్), మద్యం, ఉచిత ఇసుక కేసులో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ఉత్తర్వులు జారీ చేశారు. దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించారు. అలానే మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీనరేష్ కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఐఆర్ఆర్, ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ గత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపై ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టులో మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే వాదనలు ముగిసిన నేపథ్యంలో హైకోర్టు ఇవేళ తీర్పును ప్రకటించింది. ఈ మూడు కేసుల్లోనూ చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.
Ambati Rayudu – Pawan Kalyan: అంబటి రాయుడూ ఏమిటీ ట్విస్ట్ ..? మరలా యూటర్న్ తీసుకుంటున్నారా..?