Chandrababu: రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు అలర్జీ (చర్మసంబంధమైన రుగ్మత)తో బాధపడుతున్నారు. తీవ్ర ఎండ వేడిమి, ఉక్కపోత కారణంగా ఆయన అలర్జీతో ఇబ్బందిపడుతున్నట్లు సమాచారం. ఈ మేరకు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్) సూపర్నిటెండెంట్ కు జైల్ అధికారులు లేఖ రాశారు. చంద్రబాబు శరీరంపై దద్దుర్లు వచ్చాయనీ, చర్మసంబంధమైన వ్యాధి నిపుణులను పంపాలని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తొంది.
దీంతో జీజీహెచ్ నుండి చర్మ సంబంధమైన వ్యాధి నిపుణులు (డెర్మటాలజిస్ట్) అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సూర్యనారాయణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సునీతాదేవిలను చంద్రబాబుకు వైద్య పరీక్షల నిర్వహణకు సూపర్నిటెండెంట్ నియమించారు. వీరు రాజమండ్రి సెంట్రల్ జైల్ కు చేరుకుని చంద్రబాబు పరీక్షలు నిర్వహించి వెళ్లారు. పరీక్షల నివేదికలను జైలు శాఖ ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి పంపనున్నారు. చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో 33 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలు లో ఉన్నారు.
Chandrababu Arrest: ఫైబర్ నెట్ కేసులో సీఐడీ పీటీ వారెంట్ పిటిషన్ పై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు