NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ ఎమ్మెల్యేకు సీటు ఇచ్చిన చంద్ర‌బాబు.. ముందే చేతులెత్తేశాడే..!

ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దులో ఉన్న కీల‌క‌ నియోజకవర్గం స‌త్య‌వేడు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కొనేటి ఆదిమూలంపై టీడీపీ అభ్యర్థి తలారి ఆదిత్య తారా చంద్రకాంత్ గెలుపొందారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జేడీ రాజశేఖర్ పై వైసీపీ అభ్యర్థి కొనేటి ఆదిమూలం గెలిచారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలంను తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఆయన వైసీపీ పార్టీపై వ్యతిరేక స్వరం వినిపించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆయన ఆ తరువాత టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ పార్టీ నుంచి కొనేటి ఆదిమూలంను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది.

నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా మారిందని స్థానికంగా వినిపిస్తోంది. గత ఐదు సంవత్సరాలుగా తాము పార్టీని నమ్ముకుని అనేక ఇబ్బందులు పడ్డామని… వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలం టీడీపీ నాయకులు, కార్యకర్తల పై కేసులు ఉంటూ ప్రతి గ్రామంలోని వారిపై ఏదో ఒక కారణంతో కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని… వైసీపీ నుంచి గెలిచే అవకాశం లేకపోవడంతో టీడీపీ లో చేరారరన్నారు. నిన్నటి వరకు ఇబ్బంది పెట్టిన వ్యక్తికి ఎలా పని చేస్తామని పార్టీ క్యాడర్ అంటోంది.

మరోవైపు కొందరు టీడీపీ నాయకులు ఆదిమూలంకు మద్దతుగా నిలుస్తున్నారు. టీడీపీ పార్టీకి మొదట్నుంచీ నుంచి పని చేసి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన టీడీపీ నేత జేడీ రాజశేఖర్ ఈసారి రెబల్ గా మరారు. వైసీపీ పార్టీ ఇబ్బందులు పెట్టిన టీడీపీ పార్టీ తో ఉన్న తనకు కాదని తమపై కేసులు పెట్టిన వ్యక్తికి సీటు ఇవ్వడంతో టీడీపీ రెబల్ అభ్యర్థిగా నియోజకవర్గంలో జేడీ రాజశేఖర్ ప్రచారం సైతం చేస్తున్నారు. ఆయన వెనకంటే ఉన్న నాయకులు సైతం ఆయనకే మద్దతుగా నిలుస్తున్నారు. ఇక మరో వైపు మాజీ ఎమ్మెల్యే హేమలత తన కుమార్తె హెలెన్ కు సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

హెలెన్ ను గత రెండేళ్లు క్రితం టీడీపీ పార్టీ ఇన్చార్జి గా ప్రకటించింది. ఆమె సైతం నియోజకవర్గంలో ప్రభావం చూపే అవకాశం ఉంది. కొత్తగా ఎన్ఆర్ఐ రాజేష్ పేరు తెర పైకి వచ్చింది. నియోజకవర్గంలో ఆర్ధిక, సామాజిక వర్గం బలం ఉందని.. ఆయన సైతం పోటీలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీ పార్టీ కొనేటి ఆదిమూలంకు సీటు అని ప్రకటించినా.. ఇంతవరకు ఆయన బయటకు రాలేదు. పార్టీ అధిష్టానం సైతం నాయకులతో మాట్లాడలేదు. దీంతో ఏం జరుగుతుందో అని ఆశావాహులు ఎదురు చూస్తున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ పార్టీ కి వెళ్ళడంతో ఆ స్దానాన్ని కొత్త వ్యక్తికి వైసీపీ కేటాయించింది. తిరుపతి ఎంపీ అభ్యర్థికి సన్నిహితం గా ఉండే నూకతోటి రాజేష్ పేరు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంకూడా తోడైంది. దీంతో స‌త్య‌వేడు టీడీపీఖాతాలో ప‌డ‌డం క‌ష్టంగా ఉంద‌నే వాద‌న వినిపిస్తోంది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N