Harirama Jogaiah: ప్రస్తుతం రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాన్ వర్సెస్ వైసీపీ సర్కార్ విమర్శల యుద్దం హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. సినీరంగం విషయంలో ఏపి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శించిన నేపథ్యంలో పలువురు మంత్రులు కౌంటర్ ఏటాక్ చేశారు.
పవన్ పై మంత్రుల పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రభుత్వసలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి లు పవన్ పై ఘాటుగా విమర్శలు చేశారు. మరో పక్క పోసాని కృష్ణమురళి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చిత్ర పరిశ్రమకు అనుకూలంగా పవన్ వ్యాఖ్యలు చేసినప్పటికీ సినీరంగం పెద్దల నుండి పవన్ కు మద్దతు లభించలేదు.
Harirama Jogaiah: కీలక వ్యాఖ్యలు
అయితే సీనియర్ రాజకీయ వేత్త, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య మాత్రం ఈ వ్యవహారంపై స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఏపి మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఏపి కేబినెట్ లోని కాపు మంత్రులు పవన్ కల్యాణ్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం వెనుక సీఎం జగన్ హస్తం ఉందని చెప్పక తప్పదన్నారు. పవన్ కల్యాణ్ ను అవమానపర్చడం అంటే కాపు సమాజాన్ని అవమానపర్చడమేనని హరిరామజోగయ్య పేర్కొన్నారు. ఇలాంటి నీచ చర్యల పర్యవసానం ఏంటో 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రికి తెలిసివస్తుందని హెచ్చరించారు హరిరామజోగయ్య.
Read More: Attack on Posani: పోలీస్ వాహనంలో పోసాని కృష్ణమురళి తరలింపు..! ఎందుకంటే..?
YSRCP: తూర్పు గోదావరి జిల్లా వైసీపీ నేతలపై సీఎం జగన్ సీరియస్..?తాడేపల్లికి రావాలంటూ ఆదేశాలు..!!