Attack on Posani: హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సినీ నటుడు పోసాని కృష్ణమురళి పై పవన్ కల్యాణ్ అభిమానులు దాడికి యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో పోసాని కృష్ణమురళి మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. చిత్ర పరిశ్రమపై ఏపి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన పోసాని పవన్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. పోసాని విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ అభిమానులు ఆయనకు వ్యక్తిగత ఫోన్ కు దుర్భాషలాడుతూ సందేశాలు పంపించడం, మాట్లాడటం చేశారు. దీంతో మరో సారి పోసాని రియాక్ట్ అయ్యారు.
పవన్ అభిమానుల మాటలను తన కుటుంబపరువు తీసేలా ఉన్నాయని పోసాని ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తూ పవన్ తన అభిమనులను అదుపులో పెట్టుకోవాలని మీడియా సమావేశంలో ఘాటుగా వ్యాఖ్యానించారు. తాను జగన్ అభిమానిని, ఆయనను ఎవరేమన్నా భరించలేనని పోసాని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గతంలో పవన్ కళ్యాణ్ కు తనకు మధ్య జరిగిన ఓ గొడవ ను పోసాని మీడియాకు వివరించారు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఘూటింగ్ సందర్భంలో జరిగిన ఘటనను వివరించారు. తన కుటుంబ సభ్యులపై తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారంటూ ఆదే రీతిలో పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పోసాని మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పెద్ద ఎత్తున పవన్ అభిమానులు ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ముగిసిన తరువాత పోసాని వెళుతుండగా పవన్ అభిమానలు దాడికి యత్నించారు. ఆరుగురు పవన్ అభిమానులను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుండి తరలించారు. మరి కొందరు కూడా అక్కడ గుమిగూడటంతో పోసానిని పోలీసులు తమ వాహనంలో ప్రెస్ క్లబ్ నుండి సురక్షితంగా తరలించారు. ఈ సందర్భంలో పోసాని మాట్లాడుతూ పవన్ అభిమానుల నుండి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. తనకు ఏమైనా జరిగితే పవన్ కళ్యాణ్ యే కారణమనీ, పవన్ కళ్యాణ్ పై రేపు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
Read More:
2.Sarada pitham: విశాఖ శారదా పీఠం అయ్యవారికి జగన్ పై కోపం వచ్చింది..! ఎందుకంటే..?
3.Badvel By Poll: బద్వేలు వైసీపీ అభ్యర్థిని ప్రకటించిన సజ్జల