ఇది నిజంగానే పెద్ద షాకింగ్ న్యూస్. తాజాగా ఏపీ లో ఎన్నికలు జరుగుతోన్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఏపీ ఇంటిలిజెన్స్ వాళ్లు చేసిన సర్వేలో చాలా చిత్ర మైన ఫలితాలు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఏపీలో పోటీ చేస్తోన్న ఐదుగురు కీలక వ్యక్తులు ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి మరోసారి భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించబోతున్నారు.
అయితే ఆయనకు గత ఎన్నికల్లో 90 వేల పై చిలుకు మెజార్టీ రాగా ఈ సారి తగ్గుతుందని సర్వే స్పస్టం చేసింది. ఇక ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ఈ సారి ఓడిపోతాడని సర్వే తేల్చిచెప్పడం గమనార్హం. కుప్పంలో గత ఎన్నికల్లోనే చంద్రబాబు చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా కేవలం 30 వేల పై చిలుకు మెజార్టీతో మాత్రమే గెలిచారు. ఈ సారి ఆయన ఓడిపోతాడని సర్వేలో తేలింది.
ఇక మంగళగిరిలో చంద్రబాబు తనయుడు గత ఎన్నికల్లో ఓడిపోగా ఈ సారి మాత్రం గెలుస్తాడని వచ్చింది. లోకేష్ మంచి మెజార్టీతోనే ఈ సారి మంగళగిరిలో గెలవబోతున్నాడట. ఇక హిందూపురంలో వైసీపీ సామాజిక ఈక్వేషన్ల నేపథ్యంలో అక్కడ కూడా చాలా గట్టి పోటీయే ఉందని తేలింది. బాలయ్య ఈ సారి గెలిచినా చాలా గట్టి పోటీలో మాత్రమే బయటపడతాడని అంటున్నారు.
ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోతున్నాడట. పిఠాపురం జనాలు పవన్ను చాలా లైట్ తీస్కొంటున్నారని.. పైగా వర్మ వర్గం పవన్కు పైకి సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తున్నా లోపల యాంటీగా చేస్తోందట. ఏదేమైనా ఈ ఐదుగురు టాప్ లీడర్లలో పవన్, బాబు ఓటమి బాటలో ఉంటే జగన్, లోకేష్ గెలుపు బాటలో ఉంటే బాలయ్య గట్టి పోటీ ఎదుర్కొంటున్నాడని ఇంటిలిజెన్స్ తేల్చిచెప్పింది.