KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ ప్రజలకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్టీసీ సంస్థకు అదనపు ఆదాయం సమకూర్చే విధంగా టీఎస్ఆర్టీసి కార్గో, పార్సిల్ సేవలు అతి తక్కువ సమయంలోనే వినియోగదారుల ఆదరణ చూరగొంటున్నాయి. ఇదే సమయంలో టీఎస్ఆర్టీసీ కార్గో మరికొన్ని చర్యలు తీసుకుంటోంది. సీఎం కేసీఆర్ సలహా మేరకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా కార్గో , పార్శిల్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సరికొత్త వ్యూహాలతో కార్గో విభాగం కార్యాచరణ దిశగా అడుగులు వేస్తుండగా తాజాగా ఏపీ ప్రజలకు ఓ గుడ్ న్యూస్ వినిపించింది.
Read More: KCR: కేసీఆర్ నోటి వెంట ఆ మాట తప్ప మరోటి రావట్లేదుగా…
ఏపీ ప్రజలకు తీపికబురు ఏంటంటే…
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోనూ కొనసాగుతున్న సేవలు మరింత త్వరితగతిన అందే విధంగా టి.ఎస్.ఆర్టీసీ తగు కార్యాచరణను అమలుపరుస్తోంది. వ్యాపార కేంద్రాలైన విజయవాడ , విశాఖపట్నం పట్టణాలకు నేరుగా నిత్యం హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మీదుగా కార్గో సర్వీసులను నడుపుతోంది. 10 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన కార్గో వాహనాలను పటాన్ చెరువు , మెహిదీపట్నం , లక్షకాపూల్ , సి.బి.ఎస్ నుంచి ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ లో బయలుదేరిన కార్గో కనెక్టెడ్ పాయింట్లు కోదాడ , సూర్యాపేట , విజయవాడ , రాజమండ్రి , అన్నవరం , తుని మీదుగా విశాఖపట్నం చేరుకోనుంది . అలాగే , ఏపీ నుంచి కూడా వినియోగదారులు కార్గోను ఉపయోగించుకునే విధంగా టారిఫ్ రేట్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. ప్రైవేట్ వాటితో పోలిస్తే టి.ఎస్.ఆర్టీసీ కార్గో ఛార్జీలు సమంజసంగా ఉండటంతో వినియోగదారులు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు.
Read More: KCR: కేసీఆర్పై షర్మిల రాజకీయం మామూలుగా లేదుగా….
వినియోగదారుల డిమాండ్ మేరకు కార్గో సేవలు
ఇల్లు మారుస్తున్నప్పుడు , గృహ నిర్మాణం , పరిశ్రమలకు సంబంధించిన వస్తువులు , పర్నీచర్తో పాటు ఇతరత్రా వస్తు సామాగ్రీలను తరలించేందుకు ఈ ప్రత్యేక కార్గో అందుబాటులో ఉంచారు. దూరం, వస్తు పరిమాణం బట్టి నిర్దిష్టంగా ఒకే రకమైన ధరలు నిర్ణయించారు. సరుకులను అత్యంత వేగంగా చేరవేసేందుకు గానూ ఈ సేవలు వినియోగదారులకు ఎంతో ఉపకరిస్తాయి. రాష్ట్ర , రాష్ట్రతర ప్రాంతాలకు సరకు రవాణాకు సంబంధించిన బుకింగ్ , డెలివరీ సదుపాయాలతో పాటు వేగంగా , భద్రంగా సేవలు కొనసాగుతుండటంతో ఆదరణ చూరగొంటోంది.