YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. సీబీఐ అధికారులు దాదాపు నాలుగున్నర గంటల పాటు అవినాష్ రెడ్డిని విచారించారు. విచారణ అనంతరం అవినాష్ రెడ్డి మీడియా ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య విషయంలో తనకు తెలిసిన వాస్తవాలే సీబీఐకి చెప్పానని తెలిపారు. సరైన దిశలో విచారణ జరగాలనే తాను చెబుతున్నానన్నారు. వాస్తవాన్ని టార్గెట్ చేయకుండా వ్యక్తిని టార్గెట్ చేసి విచారణ జరుగుతోందని అవినాష్ రెడ్డి ఆరోపించారు. తనకు తెలిసిన అన్ని నిజాలతో ఒక వినతి పత్రాన్ని కూడా విచారణ అధికారికి ఇచ్చినట్లు చెప్పారు అవినాష్ రెడ్డి. ప్రస్తుత విచారణ పై ఎవరికైనా సందేహాలు వస్తాయన్నారు.
తాను ఇచ్చిన వివరాలపైనా కూలంకుషంగా విచారణ జరపాలని కోరుతున్నానన్నారు అవినాష్ రెడ్డి. వాళ్లు ఆరోపిస్తున్నట్లు గూగుల్ టేకౌటా లేక టీడీపీ టేకౌటా అనేది భవిష్యత్తులో కాలమే నిర్ణయిస్తుందన్నారు. ఏడాది క్రితం టీడీపీ వాళ్లు చేసిన విమర్శలు ఇప్పుడు సీబీఐ వాళ్లు వేసిన కౌంటర్ లో ఉన్నాయని అందుకే అనుమానించాల్సి వస్తుందన్నారు. విచారణ తీరు పట్ల ఎవరికైనా సందేహాలు కలుగుతున్నాయన్నారు. ఈ విచారణ ఏకపక్షంగా జరుగుతోంది. వాస్తవాలకు అనుగుణంగా జరగడం లేదు. పర్సన్ టార్గెట్ గా జరుగుతుంది అనే సందేహాలు ఎవరికైనా లేవనెత్తుతాయన్నారు. వివేకా చనిపోయిన రోజున మార్చురీ వద్ద ఏమి మాట్లాడానో ఇప్పుడు కూడా అదే చెబుతున్నాననీ, అదే వాస్తవమని అన్నారు.
విచారణ జరుగుతుండగానే మీడియానే ట్రయల్ చేసి దోషులు ఎవరో తేల్చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు వార్తలు వేయకుండా నిజాలను మీడియాలో ఇవ్వాలని, మీడియా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. ఇంతకు ముందు విచారణలో మరో సారి రావాల్సి ఉంటుందని చెప్పారు గానీ ఈ సారి విచారణ సందర్భంలో మరో సారి విచారణకు రావాలని సీబీఐ అధికారులు చెప్పలేదని అవినాష్ రెడ్డి తెలిపారు.
వైఎస్ వివేకా హత్య కేసుపై సజ్జల సంచలన కామెంట్స్ .. జగన్ పై చంద్రబాబు కుట్రలు అంటూ..