Nandigama (NTR) : నందిగామకు చెందిన చల్లా ఉమేష్ వరుణ్ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ఎంసెట్ లో మంచి ప్రతిభ కనబర్చారు. ఆంధ్ర ఇంజనీరింగ్ విభాగంలో ప్రధమ ర్యాంక్, తెలంగాణలో మూడవ ర్యాంక్ సాధించాడు. అంతే కాకుండా జేఈఈ అడ్వాన్డ్స్ లో 179వ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం నందిగామ భగవాన్ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉమేష్ వరుణ్ ను అభినందించి ఘనంగా సత్కరించారు.
Advertisements
నందిగామ ఖ్యాతి ని రెండు తెలుగు రాష్ట్రాలలో చాటిచెప్పాడని కొనియాడారు. ఈ సందర్భంలో విద్యార్ధి తల్లిదండ్రులు చల్లా విశ్వేశ్వర రావు దంపతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ వాసుదేవరావు, తుర్లపాటి కోటేశ్వర రావు, కొత్త సంగమేశ్వర రావు, దొడ్డపనేని సుశీల, రవీంద్ర బాబు, చిట్టెమ్మ సమితి సభ్యులు పాల్గొన్నారు.
Advertisements
Machilipatnam (Krishna): దేశంలోనే మోస్ట్ వాంటెడ్ గంజాయి స్మగ్లర్ అరెస్ట్
Advertisements