Road Accident: అన్నమయ్య జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో పది మంది గాయపడ్డారు. పుల్లంపేట మండలంలో ఆర్టీసీ బస్సు – ఆయిల్ ట్యాంకర్ లారీ ఢీకొన్న ఘటనలో మరో పది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరు మహిళల పరిస్థితి ఆందోళకరంగా ఉన్నట్లు తెలుస్తొంది. పుల్లంపేట సమీపంలోని మలుపు వద్ద జాతీయ రహదారిపై కడప నుండి తిరుపతి వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ లారీ వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదానికి లారీ డ్రైవర్ అతి వేగమే కారణమని పోలీసులు, స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదం కారణంగా రాజంపేట – తిరుపతి జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఘటనా స్థలాని చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తప్పించి ట్రాఫిక్ క్లీయర్ చేశారు. ప్రమాదంలో ఓబులవారిపల్లె మండలానికి చెందిన గుండాల శ్రీనివాసులు అలియాస్ బుడ్డయ్య (62), రాజంపేటకు చెందిన శేఖర్ (45), కడపకు చెందిన బాషా (65) మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.
YV Subba Reddy: ఒంటరిగా వచ్చినా సరే .. కలిసి వచ్చినా సరే రెడీ