Chandrababu Arrest: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఆరోగ్యంపై ఏసీబీ కోర్టులో ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై తమకు ఎలాంటి రిపోర్టు ఇవ్వడం లేదని పిటిషన్ లో చంద్రబాబు తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై తమకు ఆందోళన ఉందని పిటిషన్ లో న్యాయవాదులు ప్రస్తావించారు. వైద్యులు రిపోర్టులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని నిరాకరిస్తున్నారని అన్నారు.
చంద్రబాబు ఆరోగ్యంపై తమకు హెల్త్ బులిటెన్ ఇచ్చే విదంగా చర్యలు చేపట్టాలని పిటిషన్ లో న్యాయవాదులు కోరారు. అయితే.. చంద్రబాబు ఆరోగ్యం రిపోర్టులు మెయిల్స్ లో వచ్చాయనీ, కాపీ అందిన తర్వాత ఇస్తామని చంద్రబాబు తరపు న్యాయవాదులకు న్యాయమూర్తి తెలిపారు. ఈ పిటిషన్ పై రేపు విచారణ చేపడతామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చెప్పారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన చంద్రబాబు గత నెల 10వ తేదీ నుండి రాజమండ్రి సెంట్రల్ జైల్ లో అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన అలర్జీతో బాధపడుతుండటంతో రాజమండ్రి జీజీహెచ్ వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించారు. వేడి వాతావరణం కారణంగా ఇబ్బందులు పడటంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టు ను ఆశ్రయించగా, న్యాయమూర్తి కీలక ఆదేశాలు ఇచ్చారు. చంద్రబాబు ఉన్న బ్యారక్ లో టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో జైల్ అధికారులు టవర్ ఏసీ ఏర్పాటు చేశారు.
Chandrababu: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా