Raghurama Krishnaraju: నరసాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ రఘురామ కృష్ణరాజు గత కొద్దిరోజులుగా తనదైన శైలిలో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని ఆయన ఓ రేంజ్లో టార్గెట్ చేస్తూ లేఖలు రాస్తున్నారు. ఆయనపై వైసీపీ నేతలు ఇప్పటికే అనర్హత ఫిర్యాదు చేశారు. తాజాగా ఏకంగా వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి రంగంలోకి దిగారు. లోకసభ స్పీకర్ ఓం బిర్లా కు ఏకంగా ఆయన లేఖ రాశారు.
Read More: KCR: గల్లీలో కొట్లాట… ఢిల్లీలో ఒకే మాట అంటున్న కేసీఆర్ , జగన్
విజయసాయిరెడ్డి ఫిర్యాదులో
ఎంపీ రఘురామ కృష్ణరాజు పై అనర్హత వేటు వేయాలని దాఖలు చేసిన పిటిషన్ పై త్వరిత గతిన చర్యలు తీసుకోవాలని లోక్సభ స్పీకర్ కు రాసిన లేఖలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. తమ పిటిషన్ పై చర్యలు తీసుకోవడంలో అన్యాయమైన ఆలస్యం తగదని విజయసాయిరెడ్డి తెలిపారు. అనర్హత పిటిషన్ దాఖలు చేసి 11 నెలలు గడిచిందని పేర్కొన్న విజయసాయిరెడ్డి ఈ పిటిషన్ పై చర్యలు తీసుకోవాలని అనేకసార్లు మిమ్మల్ని కలిశామని ప్రస్తావించారు.
పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించడంలో లోక్సభ స్పీకర్ కార్యాలయం ఆదర్శంగా ఉండాలని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
Read More: KCR: కేసీఆర్ కంట్లో పడిన సీనియర్.. ఇక అన్నీ మంచిరోజులే..
నరసాపురం ప్రజలకు అన్యాయం…
అనర్హత పిటిషన్ పై చర్యలు తీసుకోవడంలో జరుగుతున్న విపరీతమైన జాప్యం వల్ల నరసాసాపురం ప్రజలకు తీరని అన్యాయం చేసినట్లవుతుందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. నరసాపురం నియోజకవర్గంలో చట్ట బద్ధంగా ఎన్నికైన వ్యక్తి అవసరమని విజయసాయిరెడ్డి అర్హత లేని వ్యక్తి పార్లమెంటు సమావేశాలకు హాజరు కావడం అనైతికమని ప్రస్తావించారు. చర్యలు తీసుకోవడంలో ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందని, ఇకనైనా వేగంగా పిటిషన్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అనర్హత పిటిషన్ పై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాల్సి ఉందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.