Breakfast: ప్రస్తుతం ఈ టెక్ యుగంలో చాలా మంది ఉదయం టిఫిన్ చేయడం మానేస్తున్నారు.. కొంతమంది బరువు తగ్గడానికి.. మరికొంతమంది టైమ్ లేక.. ఇలా రకరకాల కారణాల వల్ల బ్రేక్ ఫస్ట్ స్కిప్ చేస్తున్నారు.. మీరు ఇలానే చేస్తున్నారా.. దీని వలన లాభం చేకూరుతుందా.. ముప్పా..!? ఇంతకీ ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..!!
ఒహియో స్టేట్ యూనివర్శిటీ నిర్వహించిన సర్వేలో.. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది న్యూట్రిషన్ సొసైటీ జర్నల్ లో వచ్చిన కథనం ప్రకారం.. ఉదయం అల్పాహారం తినకుండా ఉండు వారు పోషకాలు కోల్పోయే అవకాశం ఉందని స్పష్టమైంది సుమారు 30 వేల మందిపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం తెలిసింది. బ్రేక్ ఫాస్ట్, పాలు మానేయడం వలన వలన క్యాల్షియం లోపం ఎక్కువగా ఉన్నట్లు రుజువయింది. విటమిన్ సీ తోపాటు విటమిన్లు, ఖనిజాలు, ఐరన్ లోపం ఏర్పడుతున్నట్లుగా తెలిపారు. అలాగే విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండే అల్పాహారం స్కిప్ చేసేవారు ఎక్కువ కేలరీలతో కూడిన ఆహారంతో పాటు కొవ్వులు, షుగర్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇలా బ్రేక్ ఫాస్ట్ స్క్రిప్ట్ చేసేవారు క్రమంగా బరువు పెరగడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం కాల్షియం, పొటాషియం, ఫైబర్, విటమిన్ డి వంటి పోషకాలు చాలా అవసరం. మధ్యాహ్నం, రాత్రి పూట తినే భోజనం కంటే ఉదయం తీసుకునే అల్పాహారం అనేక రకాల పోషకాలు శరీరానికి లభిస్తాయని స్పష్టమైంది.. కాబట్టి ఉదయం తీసుకునే క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ అవి ఆరోగ్యానికి హాని చేయని, రోజంతా ఉత్సాహంగా ఉంటారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అలాగే ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ స్క్రిప్ట్ చేయడం వలన గ్యాస్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఉదయం పూట సాధ్యమైనంతవరకు బ్రేక్ఫాస్ట్ తినడమే మంచిది. లేకపోతే మీ ఆరోగ్యాన్ని మీ చేతులతో మీరే చెడగొట్టు కొంటారు.