KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమదైన శైలిలో ఆసక్తికర రాజకీయాలు చేస్తున్నారా? విభిన్న ఎత్తుగడలకు పెట్టింది పేరయిన ఈ ఇద్దరు నేతలు గల్లీలో కొట్లాట… ఢిల్లీలో ఒకే మాట అంటూ ముందుకు సాగుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఈరోజు ఢిల్లీలో నిర్వహించిన విపక్ష పార్టీల నేతల సమావేశంలో ఈ మేరకు స్పష్టంగా ఈ విషయం కనిపించిందని అంటున్నారు.
Read More: KCR: కేసీఆర్ వరంగల్ పర్యటనలో ఈ రెండు అస్సలు ఊహించనివి
పాయింట్ ఏంటంటే…
ఎన్సీపీ రథసారథి శరద్ పవార్ ఇటీవల రెండుసార్లు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో భేటీ అవడం తెలిసిన సంగతే. అనంతరం పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా అన్నట్లు రాజకీయ సమీకరణాలు సాగుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా శరద్ పవార్ ఢిల్లీలో తాను సమావేశం నిర్వహిస్తున్నానని పేర్కొంటూ ఈ భేటీకి రావాలని 15 పార్టీల నేతలు, మేధావులు, కళాకారులకు పవార్ ఆహ్వానం పంపారు.
Read More: KCR: కేసీఆర్ కంట్లో పడిన సీనియర్.. ఇక అన్నీ మంచిరోజులే..
కేసీఆర్ , జగన్ డుమ్మా
మొత్తం 15 ప్రతిపక్ష పార్టీలకు అందిన ఆహ్వానంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మూడు ప్రధాన పార్టీలైన టీడీపి, టీఆర్ఎస్ , వైఎస్ఆర్సీపీ పార్టీలు హాజరు కాలేదు. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సంగతి అలా ఉంచితే రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీలు ఈ సమావేశానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ గైర్హాజరు వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లెక్కలు ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు.