KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ టూర్ అనుకోని రీతిలో వార్తల్లో నిలిచింది. కలెక్టరేట్ ప్రారంభోత్సవం, నూతన ఆస్పత్రి నిర్మాణం పనులకు ఆయన నగరానికి విచ్చేసిన రోజు పార్టీకి చెందిన ఇద్దరూ ఎమ్మెల్యేలు ఊహించని రీతిలో ఇరుకునపడ్డారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైందని మీడియాలో ప్రచారం జరిగింది. అదే సమయంలో తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేను పలువురు టార్గెట్ చేస్తూ లేఖలు పంపిణీ చేయడం హాట్ టాపిక్ అయింది.
Read More: KCR: కరోనా టెన్షన్లో కేసీఆర్ కు మళ్లీ అదే షాక్ తగిలింది…
ఆ ఎమ్మెల్యే ఊహించనిది….
సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పోలీసులు అడ్డగించారు. బందోబస్తులో భాగంగా హన్మకొండలో సుదర్శన్ వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ..మనస్థాపం చెందిన ఆయన నడుచుకుంటూ వెళ్లారు. ఎమ్మెల్యే హెడ్ క్వార్టర్ నుండి కలెక్టర్ భవనం వరకు నడుచుకుంటూ వెళ్లి నిరసన తెలిపిన పోలీసుల తీరు పట్ల సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు.
Read More: corona: గుడ్ న్యూస్ఃపిల్లలకు కరోనా ముప్పు తక్కువట
ఇంకో ఎమ్మెల్యే ఇబ్బందులపాలయ్యారుగా…
ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్లో పర్యటనలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పలు కరపత్రాల పంపిణీ కలకలం సృష్టిస్తోంది. తూర్పు ఎమ్మెల్యే నరేందర్ కబ్జాకోరు అంటూ ఆ లేఖలో రాసి ఉన్నాయి. ఈ కరపత్రాలను న్యూస్ పేపర్లో పెట్టి వరంగల్ తూర్పులో గుర్తు తెలియని వ్యక్తులు పంపిణీ చేశారని సమాచారం. రీసెంట్గా జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే నరేందర్ టీఆర్ఎస్ పార్టీ బీ ఫారంలను రూ.50 లక్షలకు అమ్మాడని సదరు కరపత్రాల్లో ఆగంతకులు ఆరోపించారు. గతంలో ములుగు జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలోనూ ఇలాగే డబ్బులు వసూలు చేశాడని గుర్తు తెలియని వ్యక్తులు ఆ లేఖలో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఈ కరపత్రాల పంపిణీ హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా ఇద్దరు ఎమ్మెల్యేలు ఇలా టార్గెట్ అవడం చర్చకు తెరలేపింది.