YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ రూటు మార్చుతోందా? ఏపీ సీఎం వైఎస్ జగన్ ను టార్గెట్ చేసే పనిలో టీఆర్ఎస్ దూకుడు వ్యవహరిస్తోందా? అంటే అవుననే అంటున్నారు ప్రస్తుత పరిణామాలను గమనించిన వారు. నీటి ప్రాజెక్టుల విషయంలో మరోమారు ఏపీ ముఖ్యమంత్రి పై తెలంగాణ మంత్రి , టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read More: KCR: కేసీఆర్ కంట్లో పడిన సీనియర్.. ఇక అన్నీ మంచిరోజులే..
ఆ మంత్రి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నిహితుడనే పేరున్న రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రావలసిన నీటిని.. ఏపీ అక్రమంగా దోచుకెళ్తుందని మండిపడ్డారు. తెలంగాణ నీటి హక్కును కాలరాస్తూ పోతిరెడ్డి పాడు నుంచి క్రిష్ణా నీటిని అక్రమ తరలింపుతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నీళ్ల దొంగగా మారితే.. తండ్రి దారిలోనే పయనిస్తూ జగన్ గజ దొంగగా మారాడని ఆయన ఆరోపించారు. తెలంగాణకు అన్యాయం చేస్తే కేసీఆర్ చూస్తూ ఊరుకోరని ఆయన హెచ్చరించారు. లంకల పుట్టినోళ్లందరూ రాక్షసులేనని.. ఆంధ్రోళ్లు ఎప్పుడూ తెలంగాణ మంచి కోరుకోలేదని ఆయన అన్నారు. ఆర్డీఎస్, రాయలసీమ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం పోరాటానికి సిద్దమవుతున్నదని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అప్పటికి కూడా ఏపీ దిగిరాకపోతే.. ప్రజా యుద్దానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు.
Read More: KCR: కేసీఆర్ వరంగల్ పర్యటనలో ఈ రెండు అస్సలు ఊహించనివి
ఆ మంత్రి సైతం…
మరోవైపు ఇప్పటికే ఏపీ ప్రభుత్వంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సైతం విరుచుకుపడ్డారు. రాయలసీమ అక్రమ ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటుందని ప్రకటించారు. సీఎం కేసీఆర్ మంచి వారికి మంచి వాడు .. చెడ్డ వారికి చెడ్డవాడు అలాంటి వారి అంతు చూస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా ఇలా ఒకరి తర్వాత మరొకరు అన్నట్లుగా కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో్ టీఆర్ఎస్ వైఖరి వెనుక మర్మం ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు.