AP High Court: హైకోర్టు తీర్పును అమలు చేయని కారణంగా ఏపిలోని ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష పడింది. హైకోర్టు తీర్పును అమలు చేయలేదని దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది.
36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటూ ఏప్రిల్ లో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తర్వులు అమలు చేయాలని పలు మార్లు ఆదేశించినా బేఖాతరు చేయడంతో ఐఏఎస్ అధికారి గిరిజా శంకర్, ఐఎఫ్ఎస్ అధికారి చిరంజీవి చౌదరికి హైకోర్టు వారం రోజుల పాటు జైలు శిక్ష విధించింది. నేటి విచారణకు అధికారులు ఇద్దరు వ్యక్తిగతంగా హజరైయ్యారు.
కాగా హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వడంతో హైకోర్టు జైలు శిక్షను వెనక్కి తీసుకున్నది. దీనిని హెచ్చరికగా పరిగణించాలని హైకోర్టు ఆదేశించింది.