AP High Court: మార్గదర్శి కేసులో చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజాకిరణ్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. సీఐడీ కేసులో తదనంతర చర్యలు అన్నింటిపై హైకోర్టు స్టే ఇచ్చింది. 8 వారాల పాటు అన్ని చర్యలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. క్వాష్ పిటిషన్ పై కౌంటర్ వేయాలని ప్రతివాదులు యూరిరెడ్డి, సీఐడీకి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 6కు వాయిదా వేసినట్లు హైకోర్టు పేర్కొంది.
మార్గదర్శిలో తమ షేర్ల వాటాను శైలజ పేరు మీదకి మార్చారనీ, తనను బెదిరించి బలవంతంగా వాటా లాక్కున్నారంటూ యూరిరెడ్డి ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ రామోజీరావు, శైలజాకిరణ్ పై చీటింగ్ తదితర సెక్షన్ల కింద నమోదు చేసింది. సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ రామోజీ, శైలజాకిరణ్ లు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రామోజీరావు తరపున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, శైలజా కిరణ్ తరపున న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు.
విచారణ సమయంలో సీఐడీకి ఏపీ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. మీ పరిధిలో లేకున్నా కేసు ఎందుకు నమోదు చేశారని ప్రశ్నించింది. ఈ కేసుకి, చిట్ ఫండ్ కేసుకి సంబంధమేంటని హైకోర్టు నిలదీసింది. చిట్ ఫండ్ కేసు అయితే అది చిట్ ఫండ్ చట్టం కిందకు వస్తుంది కదా అని హైకోర్టు సీఐడీని ప్రశ్నించింది. పిటిషన్ల తరపున బలమైన వాదనలు వినిపించడంతో హైకోర్టు తదనంతర చర్యలపై స్టే ఉత్తర్వులు ఇచ్చింది.
Janasena: తెలంగాణలో ఉమ్మడి పోటీపై పవన్ కళ్యాణ్ తో బీజేపీ నేతలు చర్చలు ..సందిగ్దంలో జనసేన