KCR: ఏపీ ప్రభుత్వం కృష్ణా నదిపై అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్న విషయంలో తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కామెంట్లు కలకలం రేపిన నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర ప్రజలను ఉద్దేశించినవి కావని అనంతరం ఆయన వివరణ ఇచ్చారు. అయినప్పటికీ, మంత్రి ప్రశాంత్ రెడ్డి టార్గెట్ అవుతున్నారు. తాజాగా షర్మిల పార్టీ నేతలు సైతం ఆయన స్పందించారు. అయితే, ఆ పార్టీ నేత కామెంట్లు సైతం అదే రీతిలో వివాదాస్పదంగా ఉండటం గమనార్హం.
Read More: KCR: గల్లీలో కొట్లాట… ఢిల్లీలో ఒకే మాట అంటున్న కేసీఆర్ , జగన్
చెప్పు దెబ్బలు తప్పవంటూ…
దివంగత సీఎం వైఎస్ఆర్ దొంగ అంటూ తెలంగాణ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని షర్మిల పార్టీ అధికార ప్రతినిధి పిట్టా రాంరెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు మంత్రులు సిగ్గుపడాలని ఆయన పేర్కొన్నారు. 2004లో వైఎస్ఆర్ తో టీఆర్ఎస్ పార్టీ పెట్టుకునేటప్పుడు సోయి లేదా అని టీఆర్ఎస్ పార్టీపై ప్రశ్నల వర్షం కురిపించారు. వైఎస్ఆర్ కాదు మీరే గజదొంగలు అంటూ విరుచుకుపడ్డారు. ఎంతోమంది పేదలకు వారి జీవితాలను మార్చే సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ఆర్ కే దక్కుతుందని షర్మిల పార్టీ నేత పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే చెప్పుదెబ్బలు తప్పవు అంటూ షర్మిల పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read More: YS Jagan: రూటు మార్చుతున్న టీఆర్ఎస్ … జగన్ పై ఆ మంత్రి సంచలన వ్యాఖ్యలు
షర్మిల పార్టీకి ఆదరణ వల్లే….
తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి తన వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణలు చెప్పాలని షర్మిల పార్టీ నేత డిమాండ్ చేశారు. తమ కామెంట్లపై మంత్రులు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన హితవు పలికారు. షర్మిల పార్టీకి వస్తున్న ఆదరణ తట్టుకోలేకే వైఎస్ఆర్ పై అధికార పార్టీ నేతలు బురద జల్లుతున్నారు అని ఆరోపించారు. ప్రజల్లో వైఎస్ఆర్ పై ఉన్న అభిమానాన్ని చంపలేరని, ఎన్ని డ్రామాలు ఆడిన జులై 8న తమ పార్టీ ప్రకటన ఉంటుందని షర్మిల పార్టీ నేత వెల్లడించారు.