Supreme Court: సుప్రీం కోర్టులో జగన్ సర్కార్ కు ఊరట లభించింది. విశాఖ రిషికొండ పై పర్యాటక శాఖ భవన నిర్మాణాలపై ఎన్జీటీ విధించిన స్టే ఎత్తివేయాలని కోరుతూ ఏపి సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు నేడు విచారణ జరిపింది. రుషి కొండలో నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే నిర్మాణాలు ఉన్న ప్రాంతంలో యథావిధిగా నిర్మాణాలు చేసుకోవచ్చని తెలిపిన కోర్టు..తవ్వకాలు చేసిన ప్రదేశంలో నిర్మాణాలు చేయవద్దని తెలిపింది. కేసులోని మెరిట్స్ పై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదని వెల్లడిస్తూ.. కేసు విచారణను ఏపి హైకోర్టుకు బదిలీ చేసింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Supreme Court: రుషికొండ నిర్మాణాల కేసు హైకోర్టుకు బదిలీ
ట్రిబ్యునల్ పరిధి కంటే హైకోర్టు పరిధి ఎక్కువని చెప్పిన సుప్రీం కోర్టు..హైకోర్టు ఆదేశించినప్పటికీ ఎన్జీటీ బేఖాతరు చేయడం తగదని హితవు పలికింది. హైకోర్టు, ఎన్జీటీ పరస్పర విరుద్ధ ఆదేశాలతో యంత్రాంగంలో గందరగోళం నెలకొందని, రాజ్యాంగ బద్ద సంస్థ కాబట్టి హైకోర్టు ఉత్తర్వులే అమలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అప్పటి వరకూ ఎన్జీటీ విచారణ జరపరాదని ఆదేశించింది సుప్రీం కోర్టు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి తదిపరి విచారణ హైకోర్టులో జరుగుతుందని, పిటిషనర్ల అభ్యంతరాలు అక్కడ చెప్పుకోవాలని సూచించింది. గతంలో రిసార్టు ఉన్న పాంతంలో పాత భవనాలు తొలగించిన చోట మాత్రం నిర్మాణాలు జరపడానికి వెసులుబాటు ఇస్తున్నట్లు తెలిపింది.
ఎన్జీటీ విచారణకు బ్రేక్
రుషికొండపై అక్రమంగా తవ్వకాలు, నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొంటూ నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు గత ఏడాది ఎన్జీటీలో దాఖలు చేసిన పిటిషన్ పై గత నెల 6వ తేదీన విచారణ జరిపింది. రుషికొండపై తవ్వకాలపై అధ్యయనం చేసేందుకు కమిటీని నియమిస్తూ నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వెలవడే వరకూ ఎలాంటి తవ్వకాలు, నిర్మాణాలు జరపరాదని ఏపి ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీ ఉత్వరులను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేయగా పై ఆదేశాలు జారీ చేసింది.