Tdp : విగ్రహాల ధ్వంసం కేసులో బయటపడ్డ టీడీపీ అసలు కుట్ర..!!
Tdp : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం ఘటనలు రాజకీయాలను కుదిపేసింది. ప్రతిపక్షాలు మొక్కుబడిగా అధికార పార్టీని భారీస్థాయిలో టార్గెట్ చేసి విమర్శలు చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో విగ్రహాల ధ్వంసం కేసులో అసలు విషయం బయట పడినట్లు సరికొత్త వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయింది. మేటర్ లోకి వెళ్తే రాజమండ్రి లలితా నగర్ సుబ్రమణ్య స్వామి విగ్రహం ధ్వంసం కేసు చేధించిన పోలీసులు. పూజారి వెంకట మురళీకృష్ణే విగ్రహాన్ని ధ్వంసం చేశాడని వివరించిన సిట్ డిఐజి అశోక్ కుమార్,విగ్రహం ధ్వంసం కేసులో టీడీపీకి చెందిన ఇద్దరు వ్యక్తులప్రమేయం పూజారి మురళి కృష్ణకు 30 వేల రూపాయలు ఇచ్చి విగ్రహాన్ని ధ్వంసం చేయించిన టీడీపీ 42 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ భర్త వెంకట రాజు, మాజీ టిఎన్టియుసి ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటపతి రాజు ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామన్న డిఐజి అశోక్ కుమార్ వివరించారు. ఇదిలా ఉంటే గతంలోనే సంతబొమ్మాలి లో నంది విగ్రహం టిడిపి పార్టీకి చెందిన వాళ్ళు బయట పెట్టడం, ఆ సమయంలో చంద్రబాబు దాన్ని సమర్ధించుకోవడం, అదేవిధంగా రాజమండ్రి లో టిడిపి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి పిఏ బాగోతం బయటపడడం తో మొత్తం రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసానికి సంబంధించిన ఘటనల విషయంలో టీడీపీ పార్టీకి చెందిన వాళ్లే బయటపడుతూ ఉండటంతో.. దేవుళ్ళ విగ్రహాలను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నట్లు సామాన్య ప్రజల నుండి టిడిపి పై విమర్శలు వినపడుతున్నాయి.