NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

త‌ప్పు చేశారు… జ‌గ‌న్ ఎమ్మెల్యేలు జైలుకే ?!

YSRCP: Reddy Leaders Indirect Warnings to Party!?

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలోని ప‌లువురు ఎమ్మెల్యేల‌పై రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్న సంగ‌తి తెలిసిందే. వివిధ అంశాల్లో స‌ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు విప‌క్షాల‌కు టార్గెట్ అవుతుంటారు.

how ysrcp status will be like upto 2023

అయితే, తాజాగా మాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఓ అడుగు ముందుకు వేసి మ‌రిన్ని సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీలో భారీ అవినీతి జరిగిందని పేర్కొన్న ఈ అంశంపై `ట్విట్టర్‌` వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు.

లోకేష్ ఏమంటున్నారు?

ఇళ్ల స్థలాలకు భూ సేకరణలో ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ నేతలు అడ్డగోలుగా అవినీతికి పాల్పడి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని మాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. పేదలకు అది సెంటు స్థలం, వైఎస్ జగన్‌కికి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు అది కుంభస్థలం అంటూ విరుచుకుప‌డ్డారు. స్థల సేకరణలో అవినీతి, చదును పేరుతో దోపిడీ, పంపిణీ పేరుతో పేదల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారని మండిపడ్డారు. పేదల పేరుతో జగన్ రెడ్డి త్రీ ఇన్ వన్ స్కాం విలువ 6,500 కోట్లని ఆరోపించారు. టీడీపీ హయాంలో కట్టిన నాణ్యమైన ఇళ్లకు బులుగు రంగు వేసినంత మాత్రాన సైకిల్ బ్రాండ్ చెరిగిపోదు అని అన్నారు. ఇప్పటి వరకూ టీడీపీ కేసుల వలనే స్థలం ఇవ్వలేకపోతున్నాం అన్నారు మరి ఇప్పుడెలా ఇస్తున్నారంటూ లోకేష్ ప్ర‌శ్నించారు. జగన్ కోటలోని మరుగుదొడ్డి కంటే తక్కువుగా కొండలు, గుట్టలు, శ్మశానాల్లో, చెరువుల్లో ఇచ్చే స్థలంలో పేదలు ఉండే పరిస్థితి లేదని లోకేష్ అన్నారు. ఇప్పుడున్న ఆధారాలతో జగనన్న జైలు పిలుస్తోంది పథకంలో భాగంగా 41 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు జైలులో జగన్ రెడ్డితో పాటు చిప్పకూడు తినడం ఖాయమంటూ లోకేష్‌ ట్వీట్‌ చేశారు

మ‌రుగుదొడ్డి కంటే త‌క్కువ‌..

మ‌రోవైపు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పేదలకు ఇచ్చే ఇంటి స్థలం జగన్ ఇంట్లో బాత్‌రూం అంత కూడా లేదని ఆయ‌న ఎద్దేవా చేశారు. నివాసం ఉంటున్న సొంత స్థలానికి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి పట్టా అంటారా అని ప్రశ్నించారు. పది లక్షల విలువైన స్థలాన్ని 50 లక్షలకు కొని, ప్రజలకు మాత్రం సెంటు భూమి మాత్రమే ఇస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల పట్టాల కొనుగోలులో 6500 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. దమ్ముంటే ఇళ్ల పట్టాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జేట్యాక్స్ కోసమే కొత్త పథకాలు ప్రారంభిస్తున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు . సెంటు భూమిలో కట్టే ఇంట్లో తనలాంటి ఎత్తు ఉన్న వాళ్లు పడుకోవడం సాధ్యం కాదని చెప్పారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N