శ్రీదేవిశరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ శ్రీ కనక దుర్గ అమ్మ వారికి టీటీడీ తరపున చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు ఇవేళ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ దంపతులకు ఆలయ ఈవో బ్రమరాంబ,,అర్చకులు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. ప్రతి ఏటా శరన్నవరాత్రి వేడుకల సందర్భంలో విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి టీటీడీ నుండి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. ఆ ఆనవాయితీ ప్రకారం నేడు టీటీడీ చైర్మన్ పట్టువస్త్రాలు సమర్పించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు.
ఈ సందర్బంగా చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో అన్ని రకాల విఐపి దర్శనాలు రద్దు చేసి సామాన్య భక్తులకు పెద్ద పీట వేశామని చెప్పారు, సీఎం ఆదేశాల మేరకు విజయవాడ . కనకదుర్గ అమ్మవారి ఆలయంలోనూ దసరా ఉత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్ద పీట వేశారని తెలిపారు. కుమ్మరి పాలెం సెంటర్ లో ఉన్న టీటీడీ స్థలంలో భక్తులకు వసతి కల్పించేందుకు కృషి చేస్తామని వైవీ వెల్లడించారు. దాతల సహకారంతో క్షేత్ర పాలక ఆంజనేయ స్వామి విగ్రహానికి బంగారు తొడుగు ఏర్పాటు చేస్తామని తెలిపారు..
సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనీ, ప్రతి ఇళ్ళు సుఖ సంతోషాలతో తులతూగేలా ఆశీర్వదించాలనీ అమ్మవారిని ప్రార్థించానని వైవీ చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు వైవీ. టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్ష్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ జోడో యాత్ర ఏపిలో అయిదు రోజులు .. ఈ నెల 17 నుండి..