YS Sharmila: వైఎస్ఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిల ఇవేళ తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఇవేళ జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ కండువా కప్ప సాదరంగా ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమంలో షర్మిల భర్త ప్రముఖ సువార్తకుడు బ్రదర్ అనిల్ కూడా పాల్గొన్నారు.
దంపతులు ఇద్దరూ పార్టీలో చేరుతున్నట్లుగా మల్లికార్జున ఖర్గే భావించారు. అందుకే షర్మిల పక్కనే ఆమె భర్త బ్రదర్ అనిల్ కు మల్లికార్జున ఖర్గే పార్టీ కండువా కప్పేందుకు సిద్దమైయ్యారు. అయితే బ్రదర్ అనిల్ పార్టీ కండువా కప్పుకునేందుకు ఇష్టపడలేదు. సున్నితంగా తిరస్కరించారు. దీంతో మల్లికార్జున ఖర్గే ఒక్క సారిగా అవాక్కయ్యారు. అదేమిటి అన్నట్లుగా ఖర్గే చూడటంతో తన ప్రొఫిషన్ చెప్పి తాను మొదటి నుండి ఏ పార్టీ కండువా కప్పుకోలేదని చెప్పడంతో ఖర్గే వెనక్కు తగ్గారు.
గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిలతో పాటు బ్రదర్ అనిల్ కూడా ప్రచారం చేశారు. అప్పుడు కూడా ఆయన పార్టీ కండువా కప్పుకోలేదు. అదే విధంగా షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ రాజకీయ పార్టీ ప్రారంభించి ఇప్పటి వరకూ కొనసాగినా బ్రదర్ అనిల్ ప్రత్యక్షంగా కార్యక్రమాల్లో పాలుపంచుకోలేదు. పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పుడు కూడా అదే మాదిరిగా పార్టీ కండువా కప్పుకోకుండానే సతీమణికి సహకరిస్తారేమో.
చాలా మంది మహిళా నేతలు యాక్టివ్ పొలిటిక్స్ లో ఉన్నా వివిధ వృత్తులు, ఉద్యోగాల్లో ఉన్న వారి భర్తలు నేరుగా పార్టీ కండువాలు కప్పుకోకుండానే తెర వెనుక ఉండి సహాయ సహకారాలు అందిస్తూ వస్తుంటారు. అదే మాదిరిగా షర్మిల భర్త కూడా అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు.
YS jagan: కేసిఆర్ ను పరామర్శించిన సీఎం జగన్