Vijaya Sai Reddy: ఏపి సర్కార్ ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తొందనీ, రాష్ట్రాన్ని జగన్ అప్పులాంధ్రగా మార్చేశారని గత కొంత కాలంగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలునకు రాష్ట్రం అప్పుల మీదనే ఆధారపడుతోందని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లింపునకూ అప్పులు వస్తే తప్ప ఇచ్చే పరిస్థితి లేదని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని కూడా విమర్శలు చేశారు.
ఈ తరుణంలో ఏపి ప్రభుత్వ అప్పులపై కేంద్ర ఆర్దిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2019 మార్చి నాటికి రూ.2,64,451 కోట్లుగా ఉన్న అప్పు 2023 మార్చి నాటికి బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.4,42,442 కోట్లుగా ఉందని ఆర్ధిక మంత్రి తెలియజేశారు. లోక్ సభలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖత పూర్వక సమాధానం ఇచ్చారు.
దీనిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి స్పందిస్తూ.. రాష్ట్రం అప్పుల పాలైందని దుష్ప్రచారం చేసే విపక్షాలు కేంద్ర ఆర్ధిక మంత్రి పార్లమెంట్ లో చెప్పిన సమాధానం చూసైనా పరివర్తన తెచ్చుకోవాలని అన్నారు. 2019 మార్చి నాటికే రాష్ట్రానికి 2,64,451 కోట్ల రుణ భారం ఉండగా, ఈ నాలుగేళ్లలో అభివృద్ధి పనుల కోసం తీసుకున్నది కేవలం రూ.1,77,991 కోట్లేనని పేర్కొన్నారు. పది లక్షల కోట్ల అప్పు అంటూ ప్రచారం చేయడం దుర్మార్గం కదా అని ప్రశ్నించారు విజయసాయి రెడ్డి.
No Confidence Motion: కేంద్రంపై అవిశ్వాస తీర్మానం.. ఇండియా కూటమి, బీఆర్ఎస్ నోటీసులు