Video Viral: రోడ్డు ప్రమాదాలు నిత్యం కృత్యం అయ్యాయి. ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోతుంటారు. మరి కొందరు గాయాలతో మృత్యువుతో పోరాడి ప్రాణాలతో బయటపడుతూ ఉంటారు. అయితే తీవ్ర స్థాయిలో ప్రమాదం జరిగి కూడా స్వల్ప గాయాలతో బయట పడ్డారు అంటే వారు నిజంగా భగవంతుడి కృపతోనే బయటపడ్డామని భావిస్తుంటారు. అటువంటి సంఘటనే రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. రహదారిపై వేగంగా వెళుతున్న ఓ లారీ .. కారును ఢీకొని ఈడ్చుకుంటూ వెళ్లినా కూడా కారులో ప్రయాణిస్తున్న వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రంగారెడ్డి జిల్లాలోని మైలార్ దేవ్ పల్లి దుర్గానగర్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
ఓ మారుతీ కారు దుర్గానగర్ నుండి చాంద్రాయణ గుట్ట వైపు వెళుతుండగా కారు టైర్ ఒక్క సారిగా పేలిపోయింది. దీంతో కారు అదుపుతప్పి పక్కనే వెళుతున్న లారీని ఢీకొట్టింది. వేగంగా వెళుతున్న ఆ లారీ .. కారును ఈడ్చుకుంటూ కొంత దూరం వెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో కారు పల్టీ కొట్టడం జరగలేదు. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గాడ్ గ్రేస్ అంటూ నెటిజన్ లు కామెంట్స్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనను చూసిన స్థానికులు తృటిలో పెను ప్రమాదం తప్పిందని పేర్కొంటున్నారు. కారులోని ఇద్దరు సురక్షితంగా బయటపడటంతో ఊపిరిపీల్చుకున్నారు.
Vijaya Sai Reddy: విపక్షాలు ఇప్పటికైనా పరివర్తన తెచ్చుకోవాలి – విజయసాయి రెడ్డి
Big #RoadAccident averted, a car driver tried to overtake a lorry from wrong side, lost control after #TyreBurst and collided with the lorry at #Mailardevpally ps limits, outskirts of #Hyderabad.
The passengers in the car escaped with minor injuries.#CarAccident #RoadSafety pic.twitter.com/OBvd1Qob9q— Surya Reddy (@jsuryareddy) July 26, 2023