Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి రాష్ట్రంలో బోగస్ ఓట్లపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఒక చంద్రగిరి నియోజకవర్గంలో లక్ష దొంగ ఓట్లు ఉన్నాయంటూ చంద్రబాబు ఆరోపించారు. దీనిపై చంద్రగిరి వైసీపీ ఇన్ చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు.
లక్ష దొంగ ఓట్లు ఉన్నాయని నిరూపిస్తే నామినేషన్ కూడా దాఖలు చేయనని సవాల్ విసిరారు మోహిత్ రెడ్డి. జగనన్న చేసిన సంక్షేమం, అభివృద్ధే తమను గెలిపిస్తాయని అన్నారు మోహిత్ రెడ్డి. దొంగ ఓట్లతో గెలవాల్సిన ఖర్మ తమకు ఎప్పుడూ లేదని అన్నారు. మా తాత వయస్సు ఉన్న మీరు నిజాలు తెలుసుకోకుండా మాట్లాడటం తగదని హితవు పలికారు.
2023 నవంబర్ లో కేవలం నాలుగు రోజుల్లో టీడీపీ వారు 14,200 దొంగ ఫారం 7 లు నింపి దరఖాస్తు చేశారని అన్నారు. ఎన్నికల కమిషన్ విచారణ చేస్తే చాలా మంది టీడీపీ వారు అరెస్టు అవుతారని అన్నారు. అసత్య ఆరోపణలు చేసిన అందరిపైనా పరువు నష్టం దావా వేసి న్యాయస్థానం ముందు, ప్రజల ముందు దోషులుగా నిలబెడతానని హెచ్చరించారు మోహిత్ రెడ్డి. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి అసత్యాలే కొనసాగిస్తే తాను నియోజకవర్గ ప్రజలతో కలిసి పోరాటం చేసేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు. అవసరం అయితే ఆమరణ నిరాహార దీక్షకు సైతం తాను వెనుకాడనని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం విజయవాడలో నిర్వహించిన సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిన్న హాజరయ్యారు. సీఈసీతో సమావేశం అనంతరం చంద్రబాబు, పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయని సీఈసీకి ఫిర్యాదు చేశామని చంద్రబాబు తెలిపారు. దొంగ ఓట్లు వేసుకుంటే తప్ప గెలవలేం అనే తుది నిర్ణయానికి వైసీపీ ప్రభుత్వం వచ్చిందని చంద్రబాబు ఆరోపించారు. ఒక్క చంద్రగిరిలోనే ఫారం-6 కింద 1 లక్ష 15 వేల ఓట్లు ఇచ్చారని తెలిపారు. వాటిలో దాదాపు 33 వేల ఓట్లను ఆమోదించారని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను సీఈసీకి ఇచ్చామని చెప్పారు. దీనిపై చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.
YSRCP: రాజ్యసభకు ఆ ముగ్గురు .. వైవీతో పాటు ఆ ఇద్దరికీ ఛాన్స్..?