Guntur Kaaram: మహేష్ బాబు కొత్త సినిమా “గుంటూరు కారం” జనవరి 12వ తారీకు విడుదల కాబోతుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం గుంటూరులో జరిగింది. మహేష్ బాబు సొంత ఊరు కావటంతో భారీ ఎత్తున అభిమానులు వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా హీరోయిన్ శ్రీలీల చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. ఆమె మాట్లాడుతూ మహేష్ బాబు గారు చాలా అందంగా కనిపిస్తారు. ఈ సినిమా షూట్ లో చాలాసార్లు ఆయనను చూస్తూ డైలాగ్స్ మర్చిపోయా దానిని. అది ఆయన గమనించి ఉంటారని నేను అనుకుంటున్నాను.
ఈ సినిమాలో మహేష్ బాబు గారితో కలసి మొదటి రోజు షూటింగ్లో పాల్గొన్న తర్వాత ఇంటికి వెళ్లాను. అయితే మహేష్ గారితో సినిమా కావటంతో ఇంట్లో వాళ్ళు ఆయన ఎలా ఉంటారు అని అడిగారు. అప్పుడు నా మనసులో నుంచి ఒక్క మాట వచ్చింది. ఒక బంగారు విగ్రహానికి ప్రాణం పోస్తే ఎలా ఉంటారో… అలా ఉంటారని చెప్పినట్లు.. శ్రీలీల తెలియజేయడం జరిగింది. ఇక సినిమా గురించి మాట్లాడుతూ “గుంటూరు కారం” టైటిల్ కి తగ్గట్టుగానే సినిమా ఘాటుగా ఉంటుంది. అయితే ఈ ఘాటులో కొంచెం తీపిగా నా అమ్ములు పాత్ర ఉంటుంది. ఇదే సమయంలో తన తోటి హీరోయిన్ మీనాక్షి చౌదరినీ కూడా పొగుడుతూ.. నీ నుంచి చాలా నేర్చుకున్నాను, నా సోదరి లాంటి దానివి అంటూ పొగడ్తల వర్షం కురిపించింది.
మా నిర్మాతలు చిన్నబాబు, వంశీ గారు.. కుటుంబ సభ్యులు మాదిరిగా చూసుకున్నారు అంటూ శ్రీలీల.. సంచలన స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కాబోతోంది. ఈ సినిమా షూటింగ్ స్టార్టింగ్ లో మెయిన్ హీరోయిన్ పూజా హెగ్డేనీ తీసుకోవడం జరిగింది. కానీ కొన్ని అన్నివార్య కారణాలవల్ల ఆమె ప్రాజెక్టు నుండి తప్పుకుంది. దీంతో మెయిన్ హీరోయిన్ అవకాశం శ్రీలీల దక్కించుకుంది. ఈ సినిమాలో మహేష్… శ్రీలీల మధ్య వచ్చే రొమాన్స్ సన్నివేశాలు.. సినిమాకే హైలెట్ గా ఉంటాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!