NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: రాజ్యసభకు ఆ ముగ్గురు .. వైవీతో పాటు ఆ ఇద్దరికీ ఛాన్స్..?

YSRCP: ఏపీ నుండి త్వరలో ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు వైసీపీ తమ అభ్యర్ధులను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. ఏపీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న   రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి (వైసీపీ), సీఎం రమేష్ (బీజేపీ), కనకమేడల రవీంద్రకుమార్ (టీడీపీ) ల పదవీ కాలం ఏప్రిల్ నెలలో ముగియనుంది.

దీంతో ఈ మూడు స్థానాలకు మార్చి నెలలో ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం అసెంబ్లీలో వైసీపీకి ఉన్న బలం ప్రకారం మూడు స్థానాలు వైసీపీ సునాయాసంగా గెలిచే అవకాశం ఉంది. వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఖాళీ అయ్యే వారి స్థానంలో ముగ్గురు అభ్యర్ధులను సీఎం జగన్ ఎంపిక చేసినట్లు తెలుస్తొంది. ఇప్పటికే అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తున్న సీఎం జగన్.. ఇటు అసెంబ్లీకి, అటు లోక్ సభకు అభ్యర్ధులుగా ఎంపిక చేయని సీనియర్ లకు రానున్న రోజుల్లో ఎమ్మెల్సీ, లేదా నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీలు ఇస్తున్నారు.

ఈ క్రమంలో త్వరలో ఖాళీ కానున్న మూడు రాజ్యసభ సీట్లకు ముగ్గురి పేర్లను ఖరారు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ముగ్గురు సభ్యుల్లో ఒకరు ఎస్సీ అభ్యర్ధికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారుట. ఉత్తరాంధ్ర వైసీపీ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, రాబోయే ఎన్నికల్లో టికెట్ లు దక్కని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రాజ్యసభకు ఈ ముగ్గురిని పంపుతారనే ప్రచారం వైసీపీ ప్రజా ప్రతినిధుల మధ్య వినబడుతోంది. ఇప్పటికే ఈ అంశంపై ముఖ్యనేతలతో సీఎం జగన్ చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. త్వరలో ఈ ముగ్గురు రాజ్యసభ అభ్యర్ధుల పేర్లను వైసీపీ అధికారికంగా ప్రకటించనుందని సమాచారం. ఇద్దరు సిట్టింగ్ లకు ఎమ్మెల్యే టికెట్ దక్కక పోయినా ఆరేళ్ల పదవీకాలం ఉన్న రాజ్యసభ దక్కుతుందటం విశేషం.

అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే టీడీపీ కూడా ఒక రాజ్యసభ స్థానానికి అభ్యర్ధిని రంగంలోకి దింపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తొంది. రాజ్యసభ అభ్యర్ధి గెలుపొందడానికి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేకపోయినా వైసీపీని ఇరుకున పెట్టి క్రాస్ ఓటింగ్ ద్వారా లబ్దిపొందాలన్న భావనతో టీడీపీ రాజ్యసభ అభ్యర్ధిపై దృష్టి పెట్టిందని అంటున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత పార్టీలో చర్చించి రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై టీడీపీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో నాల్గో అభ్యర్ధిని టీడీపీ పోటీకి దింపితే మాత్రం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాదిరిగా అసంతృప్తి వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.

YS Jagan: ఊరిపి ఉన్నంత వరకూ జగనన్న బాటలోనే – ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju