జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల మధ్య అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. డిల్లీ నుండి కబురు వచ్చిందని వెంటనే నాదెండ్ల మనోహర్ తో పవన్ ఫ్లైట్ ఎక్కేసారు. హడావిడిగా సోమవారం రాత్రికి ఢిల్లీ చేరుకున్న ఆయనకు తిరుపతి సీటు కన్ఫామ్ అని బిజెపి పార్టీ తమ అభ్యర్థిని ఉపసంహకరించుకోవాల్సిందే అని ఎంతోమంది ఊహాగానాలు చేశారు. మీడియా అయితే సోమవారం సాయంత్రం నుంచి తెగ ఊదరగొట్టేసింది. ఇక అక్కడ చూస్తేనేమో మంగళవారం రాత్రి వరకు పవన్ వెయిటింగ్ వస్తూనే ఉన్నారు. కేవలం కొద్ది సేపటి క్రితమే బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ను కలిశారు.
ఈ మీటింగ్ లో ఏం జరుగుతుంది అసలు ఏం మాట్లాడుకుంటున్నారు అన్న విషయం పక్కన పెడితే ఢిల్లీకి పవన్ వెళ్లడం వెనుక బీజేపీ వారి అంతరార్ధం ఏమిటో అర్థం కావడం లేదు. వారు చెప్పిన తర్వాతనే హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయకుండా పవన్ ఉపసంహరించుకున్నారు. అయితే అతనిని మద్దతు ఇవ్వాలని బీజేపీ అడగడంతో అతను అందుకు కూడా అంగీకరించాడు. అయితే జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారానికి కేవలం ఐదు రోజులు మాత్రమే ఉంది. పవన్ కళ్యాణ్ కు తెలంగాణ రాష్ట్రంలో భారీ ఫ్యాన్స్ ఉన్నారు. బిజెపి పై కూడా చాలామందికి అభిప్రాయం ఉంది.
హైదరాబాద్లో అయితే పవన్ అంటే గొంతు కోసుకునే వారు ఎంతోమంది. అతనిని ఒకసారి ప్రచారంలోకి నిలబెడితే ఒక్కసారిగా పరిస్థితి మార్చేస్తాడు అని అని ఎంతో మంది అభిప్రాయపడుతున్నారు అంతా. కీలకమైన పవన్కళ్యాణ్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో వాడకుండా ఢిల్లీకి అంత అత్యవసరంగా దిల్లీకి గెలిపించుకోవాల్సిన అవసరం ఏమిటి… నిజంగా అంత అత్యవసరమైన పని అయితే అతనిని ఒకటిన్నర రోజులు ఎందుకు వెయిట్ చేయించారు అర్థం కావడం లేదు.
ఈ విషయాలేమీ అగ్రనేతలకు తెలియకుండా ఉండవు…. అతనిని వెయిటింగ్ లో ఉంచడం వెనుక పెద్ద కారణమే ఉండి ఉండాలని పెరిగిపోతున్నాయి. ఇక ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో ఉంటుందని మరో భేటీ అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ను తెలంగాణలో ప్రచారానికి ఉపయోగించుకునే ఉద్దేశం ఉందా లేకపోతే ఏ ప్లాన్ తో అతనిని ఢిల్లీలోనే ఉంచారన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు.