పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాల్లో కొనసాగుతూనే ఆర్థిక పుష్టి కోసం మళ్ళీ సినిమాలు మొదలుపెట్టారు. ఇప్పటికే అతనివి మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో మరొక మల్టీస్టారర్ చిత్రం అనౌన్స్మెంట్ జరగనుంది. అయితే ఈ అనౌన్స్మెంట్ అందరూ అనుకుంటున్నట్లు ఏదో రెగ్యులర్ సినిమా అయితే కాదు..
మల్టీస్టారర్ సత్తా తెలిపే సినిమా…
పవన్ కళ్యాణ్ లాంటి డైనమిక్ పర్సనాలిటీ కి సరైన కథ పడితే రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుగు ప్రేక్షకులకు తెలుసు. బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. అలాంటి పవన్ కళ్యాణ్ ఎక్కువగా కమర్షియల్ సినిమాల వైపు మొగ్గు చూపుతాడు. కానీ రేపు ప్రకటించే సినిమా మాత్రం ఒక మలయాళం రీమేక్. అది కాకుండా పవన్ కళ్యాణ్ తో పాటు రానా కూడా కలిసి నటిస్తున్నాడు. వీరిద్దరూ కలిస్తే అక్కడ అ వెలువడే పవర్ ను తట్టుకోవడం స్క్రీన్ కు కాదు. ఇక ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు ఇంత హైప్ ఎందుకు వస్తుందో మీరందరూ తెలుసుకోవాల్సిందే.
కథలో ఉన్న విషయం అంతా ఇంతా కాదు ..!
మొదటగా ఈ చిత్రం మలయాళంలో సూపర్ డూపర్ హిట్. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ అనే ఈ చిత్రంలో ఒక దిగువ మధ్య తరగతి నిజాయితీ పోలీస్ ఆఫీసర్ కి, మరొక పక్క బాగా డబ్బు, ప్రముఖులతో కాంటాక్ట్స్, పరపతి కలిగిన వ్యక్తికి మధ్య జరిగిన ఘర్షణ చూపిస్తారు. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ కి భయకరమైన గతం ఉంటుంది. ఇది తెలుగు కమర్షియల్ సినిమాల్లో లాగా రెగ్యులర్ గా ఉండదు. ఇక్కడ ఎమోషన్స్ బాగా పండుతాయి. ప్రతి సీన్ లో ఒక కొత్త ఎమోషన్ ను ప్రేక్షకులు ఫీలవుతారు. పగ అనే పదం కన్నా అతి భయంకరమైనది ఈగో అని చెప్పే ప్రయత్నమే ఈ సినిమా.
అన్నీ శుభసూచకాలే…
అంతేకాకుండా సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో సాయి పల్లవి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా చేస్తున్నారన్న వార్తలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు అన్న వార్తలు విని అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కి ఉన్న మాస్ ఇమేజ్ ఈ మధ్య కాలంలో భారతదేశంలో వచ్చిన ఏ చిత్రంలోనూ లేదంటే అతిశయోక్తి కాదు. కళ్యాణ్ కు రానా లాంటి పర్ఫార్మర్ తోడైతే పవన్ బాక్సాఫీస్ వేట 150 కోట్ల నుండి మొదలవుతుంది అని అందరూ అంచనావేస్తున్నారు.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!