Samantha: హీరోయిన్ సమంత మయోసిటీస్ అనే అరుదైన వ్యాధితో హాస్పిటల్ లో పోరాడుతున్న సంగతి తెలిసిందే. తనకి ఈ వ్యాధి సోకినట్లు మూడో స్టేజిలో ఉన్నట్లు… గత నెల హాస్పిటల్ లో బెడ్ మీద పడుకుని దిగిన ఫోటో పోస్ట్ పెట్టి అందరికీ తెలియజేసింది. జీవితంలో మంచి రోజులు మరియు చెడ్డ రోజులు ఉంటాయి అంటూ తన పరిస్థితిని వివరిస్తూ కచ్చితంగా ఈ వ్యాధిని గెలిచి బయటకు రావటానికి పోరాడుతున్నట్లు తెలిపింది. అయితే ఒకపక్క చికిత్స తీసుకుంటూనే మరోపక్క తన కొత్త సినిమా “యశోద” సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా కొన్ని ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు ప్రతి ఒక్కరు సినిమా…..పై స్పందన తెలియజేయాలని సినిమా విడుదల అవ్వకముందు “యశోద” గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది.
కాగా నవంబర్ 11వ తారీకు అనేక భాషల్లో విడుదలైన “యశోద’ అద్భుతమైన విజయం సాధించింది. టైటిల్ రోల్ పోషించిన సమంత.. సినిమాలో వన్ మ్యాన్ ఆర్మీ మాదిరిగా రాణించింది. అయితే ఈ సినిమా విజయం సాధించడం పట్ల…ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సమంత మరో ఎమోషనల్ పోస్ట్ పెట్టడం జరిగింది. ప్రియమైన ఆడియన్స్ “యశోద” సినిమా పై మీరు చూపిస్తున్న ప్రేమ మరియు ఆదరణకు చాలా ధన్యవాదాలు. మీ ప్రశంసలు మరియు మద్దతు నాకు లభించిన అతి గొప్ప బహుమతి. యశోదా కి వస్తున్న స్పందన నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ సినిమా ప్రదర్శతమవుతున్న థియేటర్ల వద్ద మీ సంబరాలు చూసి.. చాలా సంతోషం అనిపించింది.
ఇంకా “యశోద” సినిమా ఎలా ఉందో మీరు చెప్పిన మాటలు విన్న. ఎంతటి విజయం సాధించడం వెనకాల సినిమా బృందం నిరంతరంగ పడిన కష్టం కనిపిస్తుంది. సినిమాకి అద్భుతమైన ఫలితం రావడంతో నా మనసు గాల్లో తేలుతున్నట్టు ఉంది. “యశోద” ప్రాజెక్టులో భాగస్వామ్యం అయినా ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. నాపై నమ్మకం ఉంచిన నిర్మాత శ్రీదేవి మూవీస్ శివ లంక కృష్ణ ప్రసాద్, డైరెక్టర్ హరి, హరీష్, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్.. మిగతా చిత్రపు బృందానికి నా కృతజ్ఞతలు అంటూ సోషల్ మీడియాలో సమంత పెట్టిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతుంది.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!