VeeraSimha Reddy: నందమూరి నటసింహం బాలకృష్ణ, శ్రుతి హాసన్ జంటగా నటిస్తోన్న చిత్రం వీర సింహారెడ్డి. మాస్ అండ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని రూపొందిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీజర్, పోస్టర్స్ తో అంచనాలు పెంచేసిన చిత్రయూనిట్.. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఒంగోలులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఒంగోలు కి బాలయ్య ఫ్యాన్స్ పోటెత్తారు. తాజాగా వీరసింహారెడ్డి ట్రైలర్ ను విడుదల చేశారు..
బాలయ్య ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నా వీర సింహారెడ్డి ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ లో బాలయ్య మరోసారి తన మార్కులు చూపించారు.. మాస్ డైలాగ్కులతో హోరెత్తించారు.. ఈ ట్రైలర్ విడుదలైన కొన్ని క్షణాల్లోనే విశేషమైన వ్యూస్ ను సొంతం చేసుకుంది.. బాలకృష్ణ ఫాన్స్ ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.. బాలయ్య వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి బరిలో బాక్స్ ఆఫీస్ వద్ద ఊచ కోత కలెక్షన్స్ వసూలు చేస్తుదనడంలో సందేహం లేదు..