“బాహుబలి 2” సృష్టించిన రికార్డులకు ప్రభాస్ రేంజ్ ఊహించని విధంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ రెబల్ స్టార్ నుండి పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయాడు. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు ప్రభాస్ తో సినిమా చేయడానికి ఎగబడుతున్నారు. హీరోయిన్లు సైతం ప్రభాస్ పక్కన నటించే అవకాశం కోసం క్యూ కట్టే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ “మహానటి” ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. “ప్రాజెక్టు కే” వర్కింగ్ టైటిల్ కలిగిన సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రభాస్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని వైజయంతి మూవీ బ్యానర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ దిశా పటానీ నటిస్తోంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన “లోఫర్” సినిమాలో కూడా దిశా పటానీ అప్పట్లో నటించడం జరిగింది. ఆ సినిమా పెద్దగా విజయం సాధించకపోవడంతో బాలీవుడ్ లో తన అంద చందాలతో గ్లామర్ పాత్రలు చేస్తూ వరుస అవకాశాలు అందుకుంటుంది. ఈ క్రమంలో ప్రభాస్ తో షూటింగ్ లో జాయిన్ అయిన దిశా పటానీ… డార్లింగ్ ప్రభాస్ గొప్పతనం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో తన కొత్త చిత్రం ‘ఏక్ విలన్ 2’ ప్రమోషన్ కార్యక్రమాలలో దిశా పటానీ… పాల్గొన్న సమయంలో “ప్రాజెక్టుకే” సినిమా ప్రభాస్ తో నటించడం బట్ల మీ అభిప్రాయం ఏమిటి అని.. మీడియా ప్రశ్నించడం జరిగింది. దానికి దిశా పటానీ సమాధానమిస్తూ..“నేను ఇప్పటివరకు పనిచేసిన మంచి నటుల్లో ప్రభాస్ ఒకరు. ప్రభాస్ చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆయనతో నా మొదటి రోజు షూట్ నాకు ఇప్పటికీ గుర్తుంది. ప్రభాస్ నాకు ఆ రోజు తన ఇంట్లో తయారు చేసిన ఫుడ్ ను తీసుకువచ్చి ఇచ్చారు. మా సినిమా టీమ్ మొత్తానికి ప్రభాస్ ఫుడ్ తీసుకొచ్చారు. ప్రభాస్ చాలా గ్రేట్’.. అంటూ.. చెప్పుకొచ్చింది. మరి ప్రభాస్ సినిమాతో నైనా దిశా పటానీ.. ఈసారి సత్తా చాటుతోందో లేదో చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!