దాసరి నారాయణరావు పెద్ద కుమారుడి ఆచూకి లభించింది. ముందే ఊహించినట్టుగానే ఆయన చిత్తూరులోనే ఉన్నారు. అక్కడి నుంచి పోలీసులు ఆయన్ని హైదరాబాద్కు తీసుకొచ్చారు. జూన్ 9 నుంచీ ఆయన కనిపించలేదు. దీంతో ఆయన మేనమామ నార్ల సురేంద్రప్రసాద్ ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. దాన్ని బట్టి ఆయన చిత్తూరు బస్సు ఎక్కినట్టు అర్థమైంది. వెంటనే చిత్తూరు పోలీసులను పాలో అప్ పెట్టారు. అక్కడి పోలీసులు చురుగ్గా పనిచేసి ఆయన ఆచూకిని తెలుసుకున్నారు.దాసరి ప్రభు ఇంటినుంచి వెళ్లిపోవడం ఇదే ప్రథమం ఏమీ కాదు. గతంలోనూ ఆయన అలాగే వెళ్లిపోయారు. పెళ్లి విషయంలో ఆయనకు ఇబ్బందులున్నాయి. దానికి తోడు దాసరి మరణం తర్వాత ఆస్తుల గొడవలు కూడా తలెత్తినట్టు సమాచారం.
previous post
next post
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!