Balakrishna: `అఖండ`తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుని మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన నటసింహం నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మలినేనితో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రను పోషిస్తోంది. అలాగే బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రను కన్నడ స్టార్ దునియా విజయ్ పోషిస్తున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. `ఎన్బీకే 107` వర్కింగ్ టైటిల్తో ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీ.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి బాలయ్య ఫ్యాన్స్ గంతేసే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.
అదేంటంటే.. ఉగాది పండగ సందర్భంగా ఈ సినిమా నుంచి బిగ్ ట్రీట్ రాబోతోందట. వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. `ఎన్బీకే107` ఫస్ట్ గ్లింప్స్ను ఉగాది రోజు అంటే ఏప్రిల్ 2న విడుదల చేయనున్నాడు. అంతేకాదు, టైటిల్ పోస్టర్ను కూడా ఫస్ట్ గ్లింప్స్తో పాటు బయటకు వదలనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
మరి ఈ ప్రచారం నిజమో.. కాదో.. తెలియాలంటే చిత్ర టీమ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా, `ఎన్బీకే107` అనంతరం బాలకృష్ణ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ మూవీ చేయనున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!