ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇటీవల వివాదాస్పద వార్తల్లోకెక్కుతున్న సంగతి తెలిసింది. ట్విట్టర్ కొనుగోలు చేయడానికి ఎలాన్ మస్క్ రెడీ అయ్యి ఆ తర్వాత తప్పుకోవడం ఇప్పుడు ఈ వివాదం కోర్టుకు ఎక్కటం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఎలాన్ మస్క్ ఓ తెలుగు సినిమా చూసినట్లు వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి విషయంలోకి వెళ్తే శరత్ మాండవ దర్శకత్వంలో మాస్ రాజా రవితేజ “రామారావు ఆన్ డ్యూటీ” అనే సినిమా చేయడం తెలిసింది.
జులై 29వ తారీకు ఈ సినిమా విడుదలయ్యింది. అయితే ఈ సినిమా ఎలాన్ మస్క్ చూసినట్లు తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలో ఫ్యాక్ట్ చెక్ “రామారావు ఆన్ డ్యూటీ” నీ ఎలాన్ మస్క్ చూడలేదని స్పష్టం చేయడం జరిగింది. ఎలాన్ మస్క్ ట్విట్టర్ అకౌంట్ పేరిట.. “రామారావు ఆన్ డ్యూటీ” సినిమా చూసినట్లు .. లేటెస్ట్ గా ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. అందులో టెస్లా తెలుగు ప్రాంతానికి చెందిన ఉద్యోగస్తులు.. చూడాలని, రామారావు ఆన్ డ్యూటీ చాలా బాగుందని మెచ్చుకున్నారు.
“KGF 2” కి బదులు ఈ సినిమా చూడండి అంటూ ఎలాన్ మస్క్ పేరిట పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే ఆ పోస్ట్ కింద 28 ఏప్రిల్ 2022 అనే తేదీ ఉండటంతో అడ్డంగా బుక్ అయిపోయారు. సినిమా జులై 29 విడుదల అయింది. దీంతో ఫ్యాక్ట్ చెక్ ఎలాన్ మస్క్.. పేరిట “రామారావు ఆన్ డ్యూటీ” సినిమా చూసినట్లు వచ్చిన వార్త ఫేక్ అని తేల్చేసింది. తెలుగు సినిమా రంగం స్థాయి ఇటీవల పెరగడంతో ఇటీవల ఇటువంటి వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఫ్యాక్ట్ చెక్ ద్వారా అసలు వాస్తవాలు బయటపడుతున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!