Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఓవైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూనే.. మరోవైపు నిర్మాతగానూ సత్తా చాటుతున్నారు. ఈయన నిర్మాణంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `మేజర్`. అవును, ఈ మహేశ్ ఈ పాన్ ఇండియా మూవీతో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టవ్ అడివి శేష్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు.
శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటించగా.. శోభిత ధూళిపాళ్ల, ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ, రేవతి తదితరులు కీలకపాత్రలు పోషించారు. జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితగాథ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా జూన్ 3న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ మరియు హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది. అయితే ఈ రోజు హైదరాబాద్లో ఓ ఈవెంట్ ఏర్పాటు చేసి అక్కడ మేజర్ ట్రైలర్ను మహేశ్ బాబు బయటకు వదిలారు. ఈ సందర్భంగా రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు మహేశ్ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చి అందరినీ నవ్వించారు.
ఈ క్రమంలోనే ఓ రిపోర్టర్ `మేజర్ సినిమా చూసిన తర్వాత అడివి శేష్ పోషించిన సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను నేను చేసి ఉంటే బాగుండేది అనే ఆలోచన మీకు వచ్చిందా..?` అంటూ ప్రశ్నించారు. అందుకు మహేశ్ బదులిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. `కొన్నికొన్ని సినిమాలు కొంతమందే చేయాలి. ఈ సినిమా శేష్ హృదయం నుంచి వచ్చింది. అలాంటివి మనం చూసినపుడు ఎంజాయ్ చేయాలి. అయినా నాకంత స్వార్థం లేదు..ఆరే ఇది మనం చేసి ఉంటే పోయేది అని నేను అనుకోను` అంటూ మహేశ్ సరదాగా సమాధానం ఇచ్చారు.