Vijaya Sai Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ – జనసేన పొత్తుల అంశం హాట్ టాపిక్ గా ఉంది. ఈ తరుణంలో టీడీపీ, వైసీపీ నేతలు దీనిపై చేస్తున్న కీలక వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. వైసీపీి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వము అంటూ పరోక్షంగా పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసమే పని చేస్తున్నారంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ 151 సీట్లతో చాలా బలంగా ఉంది. ఈ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కోవడం సింగిల్ గా టీడీపీకి సాధ్యం కాదన్న వాదనలు వినబడుతున్నాయి. ఇదే విషయంపై టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Vijaya Sai Reddy: వైసీపీని ఎదుర్కొవడం అంత ఈజీ కాదు
వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీని ఎదుర్కొవడం అంత ఈజీ కాదని వర్ల రామయ్య ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనతో పాటు అన్ని రాజకీయ పార్టీలు కలిసి వస్తాయని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు కూడా అందరూ కలిసి రావాలన్న దిశగా ఆలోచన చేస్తున్నారని వర్ల రామయ్య చెప్పారు. అయితే టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదు అన్నట్లుగా ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ పొత్తుల విషయంలో చెప్పాల్సింది సోము వీర్రాజు కాదనీ, ఆ పార్టీ అధిష్టానం అని పేర్కొన్నారు వర్ల రామయ్య.
Vijaya Sai Reddy: సింగల్ గా వస్తారో వేరే పార్టీలతో మింగిల్ అయి వస్తారో మీ ఇష్టం
పార్టీల పొత్తులపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపి, జనసేనల ను ఉద్దేశించి..సింగల్ గా వస్తారో వేరే పార్టీలతో మింగిల్ అయి వస్తారో మీ ఇష్టం అంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ మాత్రం సింగిల్ గానే ప్రజలతో మింగిల్ అవుతుందని పేర్కొన్నారు. జాతి పార్టీలతో జత కడతారో జాతీయ పార్టీలతో కలుస్తారో అది మీ ఇష్టం అని అన్నారు విజయసాయి రెడ్డి. మా అధినేత మాత్రం ఎప్పటికీ జనంతోనే మమేకమవుతారు అని పేర్కొన్నారు.