RC15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ “RRR”తో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకోవడం తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియాలో తిరుగులేని మార్కెట్ చరణ్ సొంతం అయ్యింది. ఈ క్రమంలో తన కెరియర్ లో 15వ సినిమా ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. “RC 15” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ కాస్త స్లోగా సాగుతోంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. చరణ్ కెరియర్ లోనే అత్యంత హై బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోంది. దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నాడు.
అయితే ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నీ శంకర్ తీసుకోవడం జరిగింది అని ప్రచారం జరుగుతుంది. సినిమాలో సెకండాఫ్ లో వచ్చే మోహన్ లాల్ పాత్ర సినిమాకి హైలెట్ గా ఉండేలా.. చాలా పవర్ ఫుల్ గా చూపించనున్నారట. ఈ క్రమంలో త్వరలోనే మోహన్ లాల్ పాత్రకు సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చరణ్ 3 ఈ భిన్నమైన పాత్రలలో కనిపించనున్నారు. ఒకటి గ్రామీణ ప్రాంతానికి చెందిన నాయకుడిగా.. మరొకటి కాలేజీ స్టూడెంట్ పాత్రలో ఇంకొకటి కలెక్టర్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఈ పాటికి కంప్లీట్ కావాల్సి ఉంది. అయితే మధ్యలో ఆగిపోయిన “ఇండియన్ 2″ షూటింగ్ రీస్టార్ట్ కావటంతో శంకర్ ఆ సినిమాకి పనిచేయడంతో…”RC 15” షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో కార్మికుల సమ్మె చేయటంతో… షూటింగ్ కి మరింత ఆలస్యం అయింది. అయితే ప్రస్తుతం మాత్రం చాలా త్వరగా కంప్లీట్ చేయాలని శంకర్ తో పాటు నిర్మాత దిల్ రాజు డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఏలాగైనా వచ్చే ఏడాది సమ్మర్ లో మాత్రం ఈ సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.