కింగ్ నాగార్జున కెరీర్లో `నిన్నే పెళ్ళాడతా` వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్. ఈ సినిమాలో నాగ్, టబు జోడికి మంచి అప్రిసియేషన్ వచ్చింది. తర్వాత వీళ్లిద్దరకూ కలిసి `ఆవిడా మా ఆవిడే` చిత్రంలో జంటగా నటించారు. అలాగే `సిసింద్రీ` చిత్రంలో నాగార్జునతో స్పెషల్ సాంగ్లో టబు ఆడిపాడింది కూడా. వీళ్లిద్దరూ జోడి కట్టి చాలా ఏళ్లు అయ్యింది. ఇప్పుడు మరోసారి నాగార్జున, టబు వెండితెరపై సందడి చేయబోతున్నారని సమాచారం. వివరాల్లోకెళ్తే.. నాగార్జున, రకుల్ జంటగా నటిస్తోన్న చిత్రం `మన్మథుడు 2`. `మన్మథుడు` సీక్వెల్గా రూపొందుతోన్న `మన్మథుడు 2`లో సోనాని బింద్రేను ఓ కీలక పాత్రల నటింప చేయడానికి యూనిట్ సన్నాహాలు చేసింది. అయితే సోనాలి ఇప్పుడిప్పుడే క్యాన్సర్ నుండి బయటపడి ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కాబట్టి సోనాలి ఆఫర్ను సున్నితంగా తిరస్కరించిందట. దాంతో యూనిట్ ఇప్పుడు ఆ స్థానంలో టబును తీసుకోవాలనుకుంటున్నారు. మరి ఆఫర్కు టబు ఒప్పుకుంటుందో లేదో చూడాలి.
previous post
next post