Nagarjuna: `బంగార్రాజు` సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఫుల్ జ్యోష్లో ఉన్న కింగ్ నాగార్జున.. తన తదుపరి చిత్రాన్ని ప్రవీణ్ సత్తారుతో ప్రకటించారు. `ది ఘోస్ట్` టైటిల్తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇందులో మొదట కాజల్ అగర్వాల్ను హీరోయిన్గా ఎంపిక చేశారు. కానీ, ఆమె ప్రెగ్నెంట్ కావడంతో.. ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. దాంతో సోనాల్ చౌహాన్ హీరోయిన్గా దింపారు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. లెటెస్ట్ సమాచారం ప్రకారం.. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్లో విడుదల చేయాలని భావిస్తున్నారట.
ఆ టార్గెట్తోనే నాగార్జున ఏ మాత్రం బ్రేక్ తీసుకోకుండా ఘోస్ట్ షూటింగ్ను త్వరత్వరగా కానిచ్చేస్తున్నాడట. ఇప్పటికే సగం షూటింగ్ కంప్లీట్ అయిందని.. మరో రెండు, మూడు నెలల్లో మిగిలిన సగ భాగం కూడా పూర్తి కానుందని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.
కాగా, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ సినిమాలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇంటర్పోల్ ఆఫీసర్స్గా కనిపించబోతున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ఇందులో ముఖ్య పాత్రలను పోషిస్తుండగా.. ముఖేష్ ఈ మూవీకి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో నాగ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!