Ante Sundaraniki: నాచురల్ స్టార్ నాని నటించిన “అంటే సుందరానికి” జూన్ పదవ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. జూన్ 9 వ తారీకు అనగా ఈరోజు ఈ సినిమాకి సంబంధించి గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళావేదికలో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ వస్తున్నారు. ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ మరియు ఫోటోలు, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నజ్రియా నజీమ్ ఫస్ట్ టైం తెలుగులో నటిస్తుండటంతో.. సినిమాకి మరింత గ్లామర్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ క్రమంలో పలు ఇంటర్వ్యూలలో నాని, నజ్రియా, వివేక్ ఆత్రేయ లు పాల్గొని “అంటే సుందరానికి” సినిమాకి సంబంధించి అనేక విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని ఒక కొత్త విషయాన్ని బయటపెట్టారు. అదేమిటంటే లాక్ డౌన్ సమయంలో ఔట్ డోర్ షూటింగ్ చేయాల్సి వచ్చింది. ఆ టైంలో సినిమా యూనిట్ మొత్తం అందరికీ వీసా వచ్చింది ఒక దర్శకుడికి తప్ప. దీంతో ఆన్ లైన్ లో షూటింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మేము షూటింగ్ చేస్తున్న ప్రాంతం మొత్తం మైనస్ డిగ్రీ చలి కలిగిన ప్రదేశం. దీంతో షూటింగ్ చేస్తున్న టైంలో చలితో వణికి పోవాల్సిన పరిస్థితి. డైరెక్టర్ మాత్రం రూమ్ లో కూర్చుని… వన్ మోర్.. వన్ మోర్ అంటూ అనేక టేక్ లు చెప్పేవాడు.
దీంతో మాకు మాత్రం తెగ కోపం వచ్చేది. డైరెక్టర్ నువ్వు వచ్చి ఉంటే తెలిసేది మా కష్టాలు అని అనుకునే వాళ్ళం. సినిమా యూనిట్ టీం మొత్తం చలిని తట్టుకోవడానికి ఒక్కొక్కరు ఐదు స్వెటర్లు వేసుకుని షూటింగ్ లో పాల్గొన్న వాళ్లు. నేను, నజ్రీయా మామూలు డ్రెస్ లో షూటింగ్ చేసేవాళ్ళం. అయితే చలికి చచ్చిపోయే వాళ్ళం. ఒకసారి తాగుదామా అనిపించింది. కానీ ఒకసారి చలికి తట్టుకోలేక ఏం చేయాలో తెలియక.. నేను తాగేశాను. హీరోయిన్ మాత్రం తాగలేదు.. అంటూ అవుట్ డోర్ షూటింగ్ కి సంబంధించి పడిన కష్టాలను ప్రమోషన్ కార్యక్రమాల్లో నాని చెప్పుకొచ్చారు. “అంటే సుందరానికి” జూన్ పదవ తారీకు విడుదల కానున్న నేపథ్యంలో హీరో నాని వరుస పెట్టి పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!