టాలీవుడ్ లో 2020 ప్రారంభం వరకు ఎక్కువగా వినిపించిన పేర్లు రెండే. ఒకటి పూజా హెగ్డే..రెండు రష్మిక మందన్న. 2020 సంక్రాంతికి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు ఆ తర్వాత వచ్చిన నితిన్ భీష్మ సినిమాల తో రష్మిక బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకుంది. అలాగే పూజా హెగ్డే.. త్రివిక్రం శ్రీనివాస్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇండస్ట్రీ రికార్డ్ అల వైకుంఠపురములో నటించింది. చెప్పాలంటే టాలీవుడ్ లో పూజా హెగ్డే లక్కి హీరోయిన్. తను ఏ హీరో తో నటించినా ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతు వస్తుంది. దాదాపు రష్మిక మందన్న కూడా అంతే అని చెప్పాలి.
అయితే టాలీవుడ్ లో ఈ ఇద్దరు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ దూకుడు కి కరోనా బ్రేక్ వేసింది. చెప్పాలంటే అదే ఊపు గనక కొనసాగితే ఈ ఇద్దరి చేతిలో కనీసం అరడజను సినిమాలుండేవి. అవి కూడా అన్ని స్టార్ హీరోల సినిమాలే. కాని ఇప్పుడు రష్మిక మందన్న చేతిలో ఉంది ఒక్క పుష్ప మాత్రమే. ఈ సినిమా అయిదు భాషల్లో రిలీజ్ కాబోయో భారీ పాన్ ఇండియా సినిమా. అలాగే ఒక కన్నడ సినిమా ఒక తమిళ సినిమా చేస్తుంది రష్మిక. ఇక పూజా హెగ్డే చేతిలో ప్రభాస్, అఖిల్ అక్కినేని సినిమాలున్నాయి. అలాగే రెండు హిందీ సినిమాలతో పాటు ఒకటి రెండు తమిళ సినిమాలున్నాయి అంటున్నారు.
కాని ఇప్పుడు ఈ ఇద్దరిని మించి పోయింది కీర్తి సురేష్. వాస్తవంగా పెంగ్విన్ సినిమా బయటకు వచ్చే వరకు కీర్తి సురేష్ నటిస్తున్న సినిమాల లిస్ట్ ఏంటో ఎవరికీ తెలీదు. కాని తన చేతిలో 6-7 సినిమాలున్నాయి. టాలీవుడ్ లో నితిన్ సరసన రంగ్ దే సినిమా చేస్తోంది. ఈ సినిమా కాకుండా మరో నితిన్ సినిమా.. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట కూడా లో కీర్తి పేరు పరిశీలిస్తున్నారు. ఇక ఇప్పటికే నాలుగు బాషల్లో పెంగ్విన్ రిలీజ్ కాబోతుంది. ఇవి కాకుండా మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ, అన్నాత్తే, సినిమాలతో పాటు ఒక మళయాళ సినిమా చేస్తోంది. అంతేకాదు పూజా హెగ్డే, రష్మిక కంటే కూడా కీర్తి సురేష్ కి సౌత్ లో ఉన్న క్రేజ్ డబుల్ అని చెప్పాలి.