క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా పవన్ హీరోగా నటిస్తున్న “హరిహర వీరమల్లు” నుండి కొత్త అప్ డేట్ వచ్చింది. మహమ్మారి కరోనా ఎంట్రీ ఇవ్వకు ముందు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపు 30 శాతానికి పైగా కంప్లీట్ అయింది. కానీ కరోనా వచ్చాక పరిస్థితులు మొత్తం మారిపోవడంతో పలుమార్లు ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడం జరిగింది.
ఇదిలా ఉంటే సెప్టెంబర్ రెండవ తారీకు పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా “హరిహర వీరమల్లు” సినిమా యూనిట్ సరికొత్త అప్ డేట్ అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబరు 2 సాయంత్రం 05.45 గంటలకు ఈ చిత్రం నుంచి ‘పవర్ గ్లాన్స్’ విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేయడం జరిగింది. మొగల సామ్రాజ్యం కాలం నాటి చారిత్రాత్మకమైన స్టోరీ తో.. ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నా ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ “ఖుషి” సినిమా నిర్మాత ఏం రత్నం.. “హరిహర వీరమల్లు” నీ నిర్మిస్తున్నారు.
ప్రాచీన యుద్ధ కాలంనాటి తరహాలో సినిమాలో ఫైట్స్ మరియు గుర్రపు స్వారీలు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి డిజైన్ చేయడం జరిగింది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. కోహినూరు వజ్రం కోసం ఈ సినిమా స్టోరీ ఉండానున్నట్లు ఇందులో మూడు విభిన్నమైన పాత్రలలో పవన్ కళ్యాణ్ కనిపించిన ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇదే టైంలో సినిమా రిలీజ్ తేదీ కూడా ప్రకటిస్తే బాగుంటుందని పవన్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక ఇదే సమయంలో పవన్ పుట్టినరోజు సందర్భంగా “జల్సా” సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 500 ధియేటర్లకు పైగానే స్పెషల్ షోలు వేస్తున్నారు.