Pawan kalyan : ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినీ గ్లామర్ తో ఏదో రీతిలో పొలిటికల్ కెరియర్ నెట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. బిజెపి పార్టీతో చేతులు కలిపి మిత్రపక్షంగా జనసేన ఏపీలో కీలకంగా రాణిస్తోంది. ఇటువంటి తరుణంలో ఇటీవల కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విశాఖ స్టీల్ కంపెనీ నీ కేంద్రం ప్రైవేటీకరణ చేయడానికి రెడీ అవటంతో ఏపీలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. విశాఖలో అయితే కార్మిక సంఘాలు మొత్తం రోడ్డెక్కి ఆందోళనలు నిరసనలు చేపట్టారు. మరోపక్క కొంతమంది నాయకులు రాజీనామా కి కూడా సిద్ధపడటం జరిగింది.
Pawan kalyan పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన
ఇదే తరుణంలో ఏపీ సీఎం జగన్ ఈ విషయంలో పునరాలోచించాలని కేంద్రానికి లెటర్ రాశారు. పరిస్థితి ఇలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ ఇదే విషయంపై బిజెపి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అదేవిధంగా మరి కొంతమంది కేంద్ర పెద్దలతో మాట్లాడటానికి ఢిల్లీ వెళ్లడం జరిగింది. పార్టీలో కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ తో కలిసి పవన్ కళ్యాణ్ తాజాగా ఢిల్లీ బాట పట్టారు. దీంతో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే అప్పట్లో బిజెపి పార్టీ నేతలను కలవడానికి అనేక పాటలు పడిన పవన్ కళ్యాణ్, కనీసం అపాయింట్మెంట్ కూడా పవన్ కి దొరకని పరిస్థితి. ఇటువంటి తరుణంలో కేంద్ర పెద్దలు తీసుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పవన్ కళ్యాణ్ మాట వినే నాధుడు కేంద్రంలో ఎవరైనా ఉంటారా ఇదంతా అతని హడావిడి అంటూ పవన్ ఢిల్లీ పర్యటన పై సెటైర్లు వేస్తున్నారు.
అప్పట్లో అమరావతి రైతులకు మీ విషయంలో ప్రధానిని కలుస్తాం అని మాట ఇచ్చారు ఇప్పుడు ఇదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా హడావిడి చేస్తున్నారు. ఇదంతా పొలిటికల్ ప్రచారం కోసం పవన్ పడుతున్న తపన, పవన్ కళ్యాణ్ మాట వినే నాయకుడు ఢిల్లీలో ఎవరు లేరు అంట సీన్ పవన్ కి లేదు అంటూ పవన్ ఢిల్లీ పర్యటన పై ప్రత్యర్థి పార్టీలకు చెందిన వాళ్లు సెటైర్లు వేస్తున్నారు. కనీసం పవన్ కళ్యాణ్ కి అపాయింట్మెంట్ అయినా దొరుకుతుందో లేదో అంటూ కౌంటర్లు వేస్తున్నారు.
Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!