Radhey Shyam: చాలా కాలం తర్వాత మార్చి 11 వ తారీకు ప్రభాస్ నటించిన సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఒక్క తెలుగులో మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా ప్రభాస్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో.. రాధేశ్యాం చూడటానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దీంతో ఇటీవలే మార్చి ప్రారంభం నుండి సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు సినిమా యూనిట్ ప్రారంభించడం జరిగింది. మ్యారేజ్ ఆ నేపథ్యంలో సినిమా రిలీజ్ అవుతున్న తరుణంలో… దేశవ్యాప్తంగా ఒక్కో రోజు ఒక్కో రాష్ట్రంలో… సినిమాకి సంబంధించిన మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు.
కాగా గతానికి భిన్నంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ప్రభాస్… చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. నిర్మొహమాటంగా మాట్లాడేస్తున్నారు. సినిమాకి మంచి ఊపు వచ్చే విధంగా సరికొత్త విషయాలు బయట పెడుతూ మాట్లాడుతూ తాజాగా హీరోయిన్ పూజా హెగ్డే లిప్ లాక్ సన్నివేశాలు పై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఆయన ఏమన్నారంటే..” ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమైనా ఇప్పటికీ రొమాంటిక్ సన్నివేశాలు నటించాలంటే చాలా సిగ్గు గా ఉంటుంది.
యాక్షన్ మూవీస్ లో అయితే ఈ లిప్ లాక్ సన్నివేశాలు రొమాన్స్ సీన్స్ కట్ చేసుకోవచ్చు. కానీ రాదే శ్యాం పూర్తి ప్రేమ కథ నేపథ్యం సినిమా. దీంతో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించాక తప్పలేదు. పూజా తో లిప్ లాక్ సీన్లు నన్ను బాగా ఇబ్బంది పెట్టడం జరిగాయి. ఇక కొన్ని సన్నివేశాలలో షర్టు లేకుండా బాగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అదే సమయంలో సెల్ లో చాలామంది చూస్తూ ఉండటం తో… నటించడానికి చాలా ఇబ్బంది పడ్డాను… నాదేశం సినిమా లో.. చాలా సందర్భాలలో సిగ్గు అనిపించింది.. అంటూ ప్రభాస్ సరికొత్త విషయాలు బయట పెట్టాడు. బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చాక సాహో రిలీజ్ కాక ఇప్పుడు మరో రెండు సంవత్సరాల గ్యాప్ వచ్చాక… రాధేశ్యామ్ రిలీజ్ అవుతున్న తరుణంలో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.